అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. జిల్లాలోని తొండంగి మండలంలో ఒకే కుటుంబానికి చెందిన 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ కుటుంబానికి చెందిన విద్యార్థి రాజమండ్రిలోని తిరుమల కాలేజీలో చదువుతున్నాడు. అతడు కాలేజీ నుంచి ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులకు కరోనా సోకినట్లు అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కుటుంబ సభ్యులను దవాఖానకు తరలించారు. ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా పాజిటివ్ వరావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత నాలుగు రోజులుగా వారు ఎవరెవరిని కలిశారనే విషయంపై ఆరాతీస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 758 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,92,984కు చేరింది. ఇదులో 8,82,314 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 3469 మంది చికిత్స పొందుతుండగా, 7201 మంది మరణించారు.