అమరావతి : తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. భద్రచలం నుంచి కాకినాడ వస్తున్న గోకవరం డిపో ఆర్టీసీ బస్సు-లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా 20 మందికి ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను మారేడుమిల్లి, రంపచోడవరం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు.
మారేడుమిల్లికి 3 కి.మీ దూరంలో ఉన్న వాలమూరు వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు.