అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 103 కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 28,670 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 103 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖాదికారులు వెల్లడించారు. కొవిడ్తో ఇద్దరు మృత్యువాత పడ్డారని తెలిపారు. 175 మంది కోలుకున్నారని వివరించారు.
ఏపీలో ప్రస్తుతం 1,358 యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు . అత్యధికంగా చిత్తూరులో 26, గుంటూరులో 16, ఈస్ట్గోదావరిలో 10 మంది, విశాఖపట్నంలో 12 మంది కొవిడ్ బారిన పడ్డారని తెలిపారు.