చేపల చెరువుల్లోనూ కాలానుగుణంగా వివిధ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడే, దిగుబడి బాగుంటుంది. చెరువు నీటిలో పెరిగే మొక్కలు, ప్లవకాల వల్ల చెరువు వాతావరణం మారుతూ ఉంటుంది. చెరువు నీటితోపాటు అడుగు భాగంలో పోషక పదార్థాల లభ్యత, వాటిలో వచ్చే రసాయనిక మార్పులు కూడా చేపల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. అందుకోసమే.. చేపల చెరువుల్లో పెరిగే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. కొన్ని రకాల నాచు మొక్కలు చేప పిల్లల శంఖులలో చేరి, వాటి శ్వాసక్రియను నిలిపేస్తాయి. ఫలితంగా, అవి మరణించే అవకాశం ఉంటుంది.