మంచిర్యాల అర్బన్, జనవరి 14 : జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం భోగి మంటల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వాకర్స్ క్లబ్ సభ్యులందరూ సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేశారు.
మహిళలు, ముస్లింలు సైతం పాల్గొని నృత్యాలు చేశారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, అధ్యక్షుడు వీరస్వామి, ప్రధాన కార్యదర్శి సాగర్ యాదవ్, కోశాధికారి మధు, గౌరవ అధ్యక్షుడు సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ మంతెన గట్టయ్య, కార్కూరి చంద్రమౌళి, బద్రుద్దీన్, విఘ్నేష్, శ్రీనివాస్, వీర శంకర్ పాల్గొన్నారు.