ఆదిలాబాద్: జిల్లాలోని జైనాథ్ మండలంలో ఘోరం జరిగింది. మండలంలోని సుందరిగిరిలో సొంత అన్ననే తమ్ముడు నరికి చంపాడు. సుందరిగిరికి చెదిన మారుతీరావు, లక్ష్మణ్ అన్నాతమ్ముళ్లు. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమ్ముడు లక్షణ్ను అన్న మారుతీరావును గొడ్డలితో నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.