ఆదిలాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ పట్టణంలో బిల్డింగ్ అండ్ పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జాయినింగ్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో సుమారు 1000 మంది యువకులతో పాటు బిల్డింగ్ పెయింటర్స్ టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు అధికార దాహం తీర్చుకున్నాయే తప్పా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్మెల్యే విమర్శించారు.
నేడు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను గడపగడపకు అందిస్తున్నామన్నారు. త్వరలో బిల్డింగ్ పెయింటర్స్ కోసం యూనియన్ భవనాన్ని నిర్మిస్తామన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జెహిర్ రంజాని, పట్టణ అధ్యక్షుడు అజయ్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కౌన్సిలర్లు అశోక్ స్వామి, భరత్, ధర్మాపాల్, తదితరులు పాల్గొన్నారు.