ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. రైతులకు పెట్టుబడి సాయం వారి ఖాతాల్లో జమ కావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు.
శనివారం ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్ గూడ లో జరిగిన రైతుబంధు సంబరాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎడ్లబండిపై సీఎం చిత్రపటాలను ఊరేగించారు.