సారంగాపూర్, మార్చి 21 : తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం 7.70 శాతం పెరిగిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సారంగాపూర్ మండలంలోని గండిరామన్న అర్బన్ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంసృతిక, సామాజిక, ఆర్థిక, పర్యావరణ అభివృద్ధికి అడువులు ఎంతగానో దోహదపడుతాయన్నారు. 2015లో సీఎం కేసీఆర్ జంగల్ బచావో-జంగల్ బడావో నినాదంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు.
ఈ ఎనిమిదేండ్లలో 273 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు చెప్పారు. తద్వారా 2015 నుంచి 2021 వరకు పచ్చదనం 7.70 శాతం పెరిగిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అడవుల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యల ఫలితంగా వన్యమృగాల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కవ్వాల్ టైగర్జోన్తో పాటు, ప్రాణహిత, పెన్గంగ సరిహద్దు ప్రాంతాల్లో పులుల సంచారం పెరిగిందన్నారు. అడవులను సంరక్షణ బాధ్యత అందరిపైనా ఉన్నదని పిలుపునిచ్చారు. అలాగే మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డి పార్కింగ్ చుట్టూ సైక్లింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో సునీల్ హెరామత్, ఖానాపూర్ ఎఫ్డీవో కోటేశ్వర్రావు, ఎఫ్ఆర్వో జైపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో ర్యాలీ..
నిర్మల్అర్బన్, మార్చి 21 : నిర్మల్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అటవీశాఖ కార్యాల యం నుంచి జయశంకర్ సార్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అవసరమని తెలియజేయడమే ప్రపంచ అటవీ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు.
ఆరోగ్యవంతమైన ప్రజల కోసం అడవులు అనే ఇతివృత్తంతో ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. రానున్న తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో సీఎం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. అడవుల పరిరక్షణ కోసం తీసుకొన్న చర్యల ఫలితంగా వన్యమృగాల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందిందని తెలిపారు. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పులుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. మహారాష్ట్రలోని తడోబా-అంధేరి టైగర్ రిజర్వ్ నుంచి పులులు మన అవసాలకు వస్తున్నాయని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కవ్వాల్ టైగర్ జోన్తో పాటు, ప్రాణాహిత, పెన్గంగ సరిహద్దు ప్రాంతాల్లో సంచారం పెరిగిందని చెప్పారు. ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, కౌన్సిలర్ బిట్లింగ్ నవీన్, పాకాల రాంచందర్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..
పే స్కేల్ అమలు చేయడంపై ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సెర్ప్ ఉద్యోగులతో కలిసి మంత్రి అల్లోల పాలాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో పచేస్తున్న సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వం పే స్కేల్ వర్తింప జేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి సెర్ప్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రిని కలిసిన నేరడిగొండ జడ్పీటీసీ..
నేరడిగొండ, మార్చి 21 : నేరడిగొండ మండలంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆయన నివాసంలో జడ్పీటీసీ జాదవ్ అనీల్ కలిశారు. వర్షం వల్ల కలిగిన నష్టంపై వివరించారు. ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంటన నేరడిగొండ ఉప సర్పంచ్ దేవేందర్రెడ్డి, నాయకులు ధన్రాజ్, శేఖర్, కిరణ్ తదితరులుఉన్నారు.