కుభీర్ : నిర్మల్ జిల్లా ( Nirmal District ) కుభీర్ మండలంలోని ఫార్డి (బి) గ్రామానికి చెందిన ర్యాపన్వార్ రుక్మ బాయి (47) అనే మహిళ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య ( Suicide ) చేసుకుందని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆదివారం అర్ద రాత్రి రుక్మ బాయి అనే మహిళ ఇంట్లో ఉన్న గుర్తు తెలియని పురుగుల మందు ( Pesticide ) తాగి ఆపస్మరక స్థితిలో పడి ఉందని వివరించారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే భైంసా ఆస్పత్రికి తరలిస్తుండగామార్గ మధ్యలో మృతి చెందిందన్నారు. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నాడని వివరించారు.
కుమారుడు తరచూ అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆస్పత్రులకు తీసుకెళ్ల లేక మనస్తాపానికి గురై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తమ్ముడు ప్రకాష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై లక్ష్మణ్ వివరించారు.