శిథిలమైనవి ఉంటే దృష్టికి తీసుకురావాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి
వాంకిడిలో ఎమ్మెల్యే సక్కుతో కలిసి ఎంపీడీవో భవనం ప్రారంభం
వాంకిడి,జూన్ 10 : శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయ భవనాలు తొలగించి, కొత్త భవనాలు నిర్మిస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడారు. ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు శిథిలావస్థలో తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి కొత్త భవనాల నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అజయ్ కుమార్,ఎంపీపీ ముండే విమలాబాయి, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ జీ మల్లేశ్, ఆసిఫాబాద్ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్ రావు, వాంకిడి సింగిల్ విండో చైర్మన్ జబురే పెంటయ్య, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘మన ఊరు-మన బడి’తో పాఠశాలల రూపు రేఖలు మారాలి
ఆసిఫాబాద్ టౌన్,జూన్ 10 : మన ఊరు-మన బడి కార్యక్రమంతో సర్కారు పాఠశాలల రూపు రేఖలు మారాలని కుమ్రం ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. పల్లె ప్రగతి, మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని రాజంపేట, చెక్పోస్ట్ కాలనీలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర రావుతో కలిసి శుక్రవారం పర్యటించారు. అనంతరం బడిబాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. పలు పాఠశాలల్లో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకన్న,మంగ,జీవన పాల్గొన్నారు.
వార్డుల్లో పర్యటించి.. సమస్యలు తెలుసుకొని
బెల్లంపల్లి టౌన్, జూన్ 10 : పట్టణ ప్రగతి కార్యక్రమం బెల్లంపల్లి మున్సి పాలిటీలో కొనసాగుతున్నది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టణంలోని 5,6,7 వార్డుల్లో శుక్రవారం పర్యటించారు. ఇంటింటీకి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. దీర్ఘకాలిక సమస్యలను విడుతల వారీగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్, కో ఆప్షన్ సభ్యుడు వాజిద్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, నాయకులు మురళి, మధు, సత్యనారాయణ, విజయ్, సన్నీ,రమేశ్,రాజేశ్ , అన్వర్, వినయ్, సురేశ్, శ్రీనివాస్, చంద్రశేఖర్, గోపీ, వెంకటేశ్, చక్రధర్ పాల్గొన్నారు.