బేల, జూన్ 15: పల్లెపల్లెకూ సంక్షేమ పథకాలు అందాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని గూడ గ్రామంలో పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నాయకలు, అధికారులు, పంచాయతీ సిబ్బంది స్వచ్ఛతపై వీధుల గుండా ర్యాలీ తీశారు. అనంతరం పారిశుధ్య కార్మికులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ వనితాఠాక్రే, నాయకులు సతీశ్పవార్, ప్రమోద్రెడ్డి, గంభీర్ఠాక్రే, సర్పంచ్ ఠాక్రే బేబితాయి, ఎంపీడీవో మహేందర్ కుమార్, ఎంపీవో సమీర్హైమద్, నాయకులు , అధికారులు పాల్గొన్నారు.
బేల, జూన్ 15: గ్రామాలను శుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని సర్పంచ్ ఇంద్రశేఖర్ అన్నారు. పల్లె ప్రగతి దినోత్సవంలో భాగంగా మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్లు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మల్టీ పర్పస్ వర్కర్లను శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు , ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మల్టీ పర్పస్ వర్కర్లకు సన్మానం
ఆదిలాబాద్ రూరల్, జూన్ 15: గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని మావల ఎంపీపీ దర్శనాల సంగీత అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బట్టిసావర్గం గ్రామంలో పల్లె ప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను సర్పంచ్ రాగం గంగమ్మ ఎగురవేశారు. అనంతరం మల్టీ పర్పస్ వర్కర్లను శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హేమలత, నాయకులు పాల్గొన్నారు.
జైనథ్, జూన్ 15: మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను సర్పంచ్లు ఎగురవేశారు. గ్రామ పంచాయతీలో పని చేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ఉట్నూర్, జూన్ 15 : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని బీఆర్ఎస్ నాయకురాలు జాదవ్ సుమన్బాయి అన్నారు. ఉట్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ తిరుమల జెండా ఎగురవేశారు. అనంతరం పంచాయతీ కార్మికులను శాలువాలతో సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో శంకర్, మాజీ సర్పంచ్ బొంత ఆశారెడ్డి, వార్డు సభ్యులు, మహిళలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పల్లెలు గర్వపడేలా ప్రగతి
ఉట్నూర్ రూరల్, జూన్ 15: పల్లెలు గర్వపడేలా ప్రగతిని సాధించామని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. ఘన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను సర్పంచ్ పంద్ర లత ఎగురవేశారు. అనంతరం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. పంచాయతీ సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. అదేవిధంగా శ్యాంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను సర్పంచ్ ఎగురవేశారు. వైస్ఎంపీపీ బాలాజీతో కలిసి పంచాయతీ సిబ్బందిని శాలువాలతో సన్మానించారు. మత్తడిగూడలో సర్పంచ్ మడావి యశోదబాయి, లక్కారంలో సర్పంచ్ రాథోడ్ జనార్దన్, పులిమడుగులో సర్పంచ్ జాదవ్ సరిత జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 15: రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, ఎంపీడీవో పుష్పలత అన్నారు. పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ తీశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కోరెంగా గాంధారి జాతీయ జెండాను ఎగురవేశారు. పంచాయతీ సిబ్బందితో పాటు కార్మికులకు ప్రశంసాపత్రాలు అందజేసి శాలువాలతో సన్మానించారు. పంచాయతీకి చెందిన వాహనాలను పూలతో అలంకరించి పూజలు చేశారు. పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈవో సంజీవరావ్ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, వైస్ఎంపీపీ గోపాల్సింగ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీవో సంతోష్కుమార్, ఇంద్రవెల్లి ఉపసర్పంచ్ గణేశ్టేహెరే, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, జూన్ 15 : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు ప్రగతిబాటలో పయనిస్తున్నాయని సర్పంచ్లు కుమ్ర యాదవ్రావ్, బానోత్ గజానంద్నాయక్ అన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని 48 గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ జెండాను సర్పంచ్లు ఎగురవేశారు. పంచాయతీ కార్యదర్శులు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం పారిశుధ్య కార్మికులను శాలువాలతో సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల సిబ్బంది, నాయకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.