ఎదులాపురం, జనవరి 1 : జిల్లా ప్రజలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న , ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదివారం న్యూ ఇయర్ శు భాకాంక్షలు తెలిపారు. ముందుగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కలెక్టర్ సిక్తా పట్నాయక్కు, అనంతరం అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్కు పూలమొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశా రు. అలాగే టీఎన్జీవోస్, ఎస్టీయూ, నాయకు లు, మీడియా మిత్రులు, స్వచ్ఛంద సంస్థల ప్ర తినిధులు తదితరులు కలిసి పూల మొక్కలు, బ్లాం కెట్లు, నోట్బుక్కులు, పెన్నులు అందజేశారు. కా ర్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమేశ్, రాథోడ్, విద్యుత్ శాఖ , పంచాయతీరాజ్, ఇతర శాఖల అధికారులతో పాటు టీఎన్జీవోస్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంద అశోక్, ఏ. నవీన్ కు మార్, తిరుమల్ రెడ్డి , ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాదవ్ అశోక్ కు మార్, శ్రీనివాస్, రవీంద్ర, చంద్రశేఖర్, శివప్రసాద్, రమేశ్, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గం గాధర్, ఇంద్ర, మీడియ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జోగు రామన్నకు ..
నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే జోగు రా మన్న ఆకాంక్షించారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ,వివిధ సంఘాల నాయకులు, అధికారులు ఆదివారం ఆయనకు పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే డీఎ స్పీ ఉమేందర్ ఆధ్వర్యంలో సబ్డివిజన్ పరిధిలోని సీఐ, ఎస్ఐలు కలిసి పూలమొక్కను అందజేసి గ్రీటింగ్స్ చెప్పారు. అలాగే వివిధ ఉపాధ్యాయుల సంఘం క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. కలిసిన వారిలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, సీఐ రఘపతి, సత్యనారాయణ, పురుషొత్తం, ఎస్ఐ హరిబాబు, సాయన్న, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
జాతీయ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో..
చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. క్యాంప్ కార్యాలయంలో జాతీయ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాయకులు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి రమేశ్, రాష్ట్ర కార్యదర్శి మోర ఆశన్న, సహాయ కార్యదర్శులు గాజుల హన్మాండ్లు, దాసరి ఆశన్న, దంతెల వినోద్, ఈరన్న, నాగన్న, దాసరి రమేశ్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే ను కలిసిన జడ్పీ చైర్మన్
బోథ్, జనవరి 1 : జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎంపీ జీ నగేశ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సర్పంచ్లు విజయ్, రమేశ్, జీ జుగాదిరావు పాల్గొన్నారు.
జైనథ్ మండల నాయకులు
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను జైనథ్ ఎంపీపీ మర్శేట్టి గోవర్ధన్ , మండల ముఖ్య నాయకులు ఆదివారం క్యాంప్ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వైస్ ఎంపీపీ విజయ్కుమార్, డీసీసీబీ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, మండల సర్పంచ్ల సంఘం నాయకుడు ఊశన్న తదితరులు పాల్గొన్నారు.