కడెం, నవంబర్ 27 : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఉట్నూర్ ఆర్డీవో సురేశ్ పేర్కొన్నారు. మండలంలోని ఉడుం పూర్, కల్లెడ, నవాబుపేట, పెద్దూర్ల్లో ఆదివారం ప్రత్యేక ఓటరు నమోదుకు చేపట్టిన క్యాంపెయిన్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియను స్థానిక తహసీల్దార్ గజానన్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఇక్కరిని నూతనంగా ఓటు హక్కు కల్పించా లని పేర్కొన్నారు. మరణించివారి పేర్లు, వివాహం చేసుకొని వెళ్లిపోయిన వారి పేర్లను జాబితా నుంఇ తొలగించాలని సూచించారు. బీఎల్వోలు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. తహ సీల్దార్ గజానన్, నాయబ్ తహసీల్దార్ చిన్నయ్య, బీఎల్వోలు, తదితరులున్నారు.
దస్తురాబాద్, నవబంర్ 27 : 18 మండలం లోని 20 పోలింగ్ కేంద్రాల్లో రెండో రోజు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా అధికారులు, బీఎల్వోలు 18 ఏండ్లు నిండిన యువతీ, యువకుల నుంచి తప్పులు ఉన్న పేర్లు సరి చేసేందుకు దరఖాస్తులు స్వీకరిం చారు. ఆర్ఐ పీ వెంకట నర్సయ్య, బీఎల్వోలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
కుంటాల, నవంబర్ 27 : అందకూర్ గ్రామం లో ఓటరు నమోదు కేంద్రాన్ని ఆదివారం తహసీల్దార్ ఖలీం సందర్శించారు. బీఎల్వోలకు తగిన సూచనలు ఇచ్చారు. 18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని ఆయన పేర్కొ న్నారు. ఆర్ఐ విజయ్, సిబ్బంది ఉన్నారు.
తానూర్, నవంబర్ 27 : మండల కేంద్రంతో పాటు ఎల్వీ గ్రామాల పోలింగ్ బూత్లను ఆర్ఐ గంగాధర్ సందర్శించారు. ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. 18 ఏండ్లు నిండిన యువతీ, యువకులకు ఓటు హక్కు కల్పించాలని సూచించారు. బీఎల్వోల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీఎల్వోలు సరస్వతి, వందన తదితరులు పాల్గొన్నారు.
పెంబి, నవంబర్ 27: కొత్త ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం 18 సంవత్సరాలు నిండిన యువకులు దరఖాస్తు చేసుకోవాలని సర్పంచ్ పూర్ణచందర్ గౌడ్ పేర్కొన్నారు. మండల కేంద్రం లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ అర్హులైన యువతీ, యువకులు గ్రామంలోనీ బీఎల్వోకు దరఖాస్తు ఫారంలు అందజేయాలని సూచించారు. బీఎల్వీలు విశ్వరూప, సుశీల పాల్గొన్నారు.