బజార్హత్నూర్, డిసెంబర్ 13 : ఓటరు నమోదు వివరాలు ఈ నెల 26వ తేదీ వరకు పూర్తి చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ఓటరు నమోదు అధికారి) వెంకటేశ్వర్లు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లోని తహసీల్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. బీఎల్వోలు, తహసీల్దార్ కూన గంగాధర్కు పలు సూచనలు చేశారు.
బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలోని ఇంటింటికీ వెళ్లి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి పేరు నమోదు చేసుకోవాలన్నారు. వారి పేర్లను రిజిస్ట్రేషన్లో నమోదు చేసి ఫారం-6లో రాయాలని సూచించారు. ఓటరుతో పాటు ఐడీ కార్డు ఉన్న వ్యక్తులు మరణించిన, వెళ్లిపోయిన వారి పేర్లు తొలగించి తప్పు ఒప్పులను సరి చేసుకోవాలన్నారు. దివ్యాంగులు ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు ఎలక్ట్రోల్ మార్కింగ్ చేయాలని వివరించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సాగర్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ హరిలాల్, ఆర్ఐ మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.