మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఆసిఫాబాద్, డిసెంబర్ 20 : పరిపాలనా సౌలభ్యం కోసం నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన సర్కారు.. మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే పల్లె ప్రగతితో గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేయగా, ప్రస్తుతం పంచాయతీలకు ఆధునిక హంగులతో సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఒక్కో జీపీ ఆఫీసుకు 20 లక్షల చొప్పున ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 483 గ్రామాల్లో కార్యాలయాలకు రూ.96.60 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ హన్మంతరావు లేఖను విడుదల చేయగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ప్రజలకు మెరుగైన పాలన అందించాలే.. కొత్తగా సాధించిన రాష్ట్ర సంక్షేమ ఫలాలు ఇంటింటికీ చేర్చాలే.. దశాబ్దాలుగా పాలనకు దూరంగా ఉన్న గిరిజన, ఆదివాసులకు రాజ్యాధికారం ఇయ్యాలే.. ఈ లక్ష్యంతోనే ఏళ్లుగా పంచాయతీ కావాలని తహతహతాడుతున్న పల్లెలు, తండాలు, గూడేలకు సీఎం కేసీఆర్ 2018లో గ్రామ పంచాయతీ(జీపీ)లుగా మార్చారు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్రంలో 3,686 గ్రామాల్లో కొత్త పంచాయతీ భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 483 గ్రామాలను ఎంపిక చేసింది. ఒక్కో పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షల ఖర్చు చేయనుండగా.. రూ.96.60 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కొత్త గ్రామాల సర్పంచ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పల్లెల ప్రగతే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో 125 పంచాయతీలకు నూతన భవనాలు మంజూరయ్యాయి. ఇందులో భీంసారి, చించుఘాట్, చిత్యాలబోరి, దిమ్మ, లాండసాగ్వీ, లింగిగూడ, మామిడిగూడ, న్యూ రాంపూర్, రామాయి, డోనా, మంగురూడ్, మణియాపూర్, మాసాల-బి, పటాన్, శాంషాబాద్, అకుర్ల, ఆనంద్పూర్, బెల్గాం, హాసీంపూర్, లక్ష్మీపూర్, లెక్కర్వాడి, మాకోడా, పార్డీ-కే, పిప్పల్గావ్, పోసాయి, రాంపూర్-టీ, శీర్సనా, సుందర్గిరి, అడ్మియన్, ఖదికి, ఖాదోడి, కుందిశేఖుగూడ, లోకారి-బి, మేదిగూడ, సావారి, బాలన్పూర్, గుండాల-జీ, జామ్డా, కాంపూర్, మారప్పగూడ, బోసార, భుట్టాయి-బి, చింతల్సాగ్వీ, డెడ్రా, దిగ్నూర్, గిర్జాల్, హర్కాయి, కిన్నెర్పల్లి, కోలహరి, మంజీరాతండా, మన్కాపూర్, తెంబి, భగవాన్పూర్, గోల్లఘట్, గుబ్డి, గుబ్డిపల్లి, గుంజా ల, ఇందూర్పల్లి, జల్కోరి, కరన్వాడి, ఖైర్గూడ, మర్కగూడ, తెక్డిరాంపూర్, గుర్రలతాండ, గుట్టపక్క తండా, కోటా-కే, లంబాడీతండా, మండోబాగూడ, నక్కల్వాడ, సాంగ్వీ, ఆడేగావ్-బి, బాజ్జిపేట్, దేవేల్నాయక్ తండా, దాబా-బి, హీరాపూర్, జల్ద్ధా, జమిడి, జున్ని, కమ్మర్గిరి, కేశవపట్నం, మాదాపూర్, సిరిచెల్మ, డోంగర్గావ్, మాన్కాపూర్, సూర్యగూడ, ఊమ్రి-బి, వైజాపూర్, అరెపల్లి, బుద్దికొండ, గుట్టపాల, కిష్టాపూర్, నాగమల్యాల్, నారాయన్పూర్, పీచార, సవార్గాం(రోడ్), నారాయన్పూర్, పొన్న, సిరికొండ, కొత్తుర్, లక్ష్మీపూర్, లింగి, పల్లి-కే, ఉమ్డం, లీమ్గూడ, పలోడి, సావర్గావ్, అంజీ, బిక్కుతండా, డొంగర్గావ్, ఈశ్వర్నగర్, గట్టేపల్లి, హర్కపూర్, హర్కపూర్తాండ, తుమ్మగూడ, తాండ్ర, చింతకర్ర, గంగపూర్, గొండ్గూడ-జి, హీరాపూర్-జే, జమల్తండా, కుమ్మరితండా, సాకిరా-బి, శ్యాంనాయక్తండా, తక్కుగూడ, ఎక్స్-రోడ్(లింగోజీతాండ) పంచాయతీలు ఉన్నాయి.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో 133 పంచాయతీలకు భవనాల నిర్మాణాలు కానున్నాయి. ఇందులో అంకోడపేట్, దేవునిగూడ, మున్నల్తండా, పెర్కపల్లి, అంబరిపేట్, బాబానాయక్తండా, ధర్మజీపేట్, దిల్దార్నగర్, ఇస్లాంపూర్, కొర్రతండా, కొత్తమడ్డిపడగ, మాసాయిపేట్, పాండువప్పుర్, బావపూర్-ఆర్, బావపూర్తండా(దాసినాయక్), బీర్నంది, ఇక్బాల్పూర్, కొత్తపేట్, పాత తార్లపడ్, రాజురా, సత్తనపల్లి, సేవానాయక్తండా, గుమ్మెనయేంగులపూర్, హైచాంద్తండా, జంగగూడ, కర్ణంలోద్ది, కిష్టనాయక్తండా, కురకంటితండా, కొస్గుట్ట, లంబాడీతండా, నాగాపూర్, కిర్గుల్-కే, బిజ్జూర్, కత్గావ్, కొంసారా, మహాగావ్, మంజ్రీ, సిరాల, టక్లీ, వనల్పాడ్, బెల్గావ్, బ్రమేశ్వర్తండా, చాట, దేవుజీనాయక్ తండా, డోడర్నా, గోదాపూర్, గోడ్సేరా, హంపలి-బి, జామ్గావ్, జూమ్డ, కుప్టీ, న్యూ సాన్వాలి, సాగ్వీ, సాన్వాలి(ఓల్డ్), శివుని తండా-1, సీర్పల్లి, వీరాగావ్ తండా, అంబకంటితండా, అంబుగావ్, వెంకుర్, బామ్ని-కే, బీల్లోలి, కిష్టాపూర్, పిప్రి, సేవాలాల్తండా, బారేగావ్, బ్రహ్మన్గాం, చించాల, చింతకుంట, ఈడ్బిడ్, ఈడ్బిడ్తండా, గన్నర, మక్కల్, విఠోలి, విఠోలితండా, బుర్గుపల్లి(జి), నాందన్, బామ్ని-బి, బామ్ని, బోండ్రట్, బారేగావ్, దహెగన్, హింపల్లితండా, ఖార్బల, దిలావర్పూర్, కల్వతండా, మాయాపూర్, సిర్గాపూర్, బోరేగావ్, మల్లాపూర్, మున్నిపల్లి, న్యూ కంజర్, తీర్పాలి, ఆదర్శనగర్, అనంతపేట్, అర్పేల్లి, బందల్ ఖానాపూర్, గైడ్పల్లి, జైరాంతండా, కమల్కోట్, కప్పన్పల్లి, కోరిటికల్, మామడ, నల్దూర్థి, న్యూ సాంగ్వి, రాయిధారి, తాండ్ర, వస్తాపూర్, అంజనితండా, కుస్లీ, తెంబుర్ని, లంగ్డాపూర్, ముక్తాపూర్, రత్నాపూర్-కే, ఎల్లారెడ్డిపేట్, ఆడెల్లి, బీరవెళ్లి, చించోలీ-బి, చించోలీ-ఎం, దుప్యాతండా, నాగపూర్, పియారాంపూర్, పోటీయా, రాంసింగ్తండా, రవీంద్రానగర్, సాయినగర్తండా, వంజర్, యాకర్పల్లి, న్యూ వెల్మల్, ఓల్డ్ పోచ్చపడ్(గాంధీనగర్), పాక్పట్ల, సాకీరా, లోకల్ వెల్మల్ పంచాయతీలు ఉన్నాయి.
మంచిర్యాల జిల్లాలో..
బెల్లంపల్లి నియోజకవర్గం మండల పరిధిలో ఆకెనపల్లి, అంకుశం, బట్వాన్పల్లి, బుచ్చయ్యపల్లి, చాకెపల్లి, చంద్రవెల్లి, దుగ్నేపల్లి, గుర్జాల, కన్నాల, లంబాడీతండా, లింగాపూర్.. భీమిని మండలంలో బిట్టూర్పల్లి, కేస్లాపూర్, ఖర్జి భీంపూర్, లక్ష్మిపూర్, పెద్దపేట్, వీగామ్, వెంకటాపూర్.. కన్నెపల్లి మండలంలో గొల్లగట్టు, జజ్జరెల్లి, మడవెల్లి, పొలంపల్లి.. కాసిపేట మండలంలో బుగ్గగూడ, చిన్నధర్మారం, లంబాడీతండా(కే), మద్దిమడ, మల్కెపల్లి, పల్లంగూడ, సోమగూడెం(కే), తాటిగూడ.. నెన్నెల మండలంలోని ఆవడం, చిన్న వెంకటాపూర్, గంగారం, గొల్లపల్లి, నర్వాయ్పేట, నెన్నెల.. తాండూరు మండలంలో బోయపల్లి, ద్వారకాపూర్, గోపాల్నగర్, కొత్తపల్లి, నీలాయిపల్లి, రేచిని.. వేమనపల్లి మండలం చమాన్పల్లి, ముల్కపేట్, నగరం, నీల్వాయి, రాజారం, సుంప్తం, సూరారం.. వేమనపల్లి గ్రామాల్లో కొత్త పంచాయతీ భవనాలు నిర్మించనున్నారు.
చెన్నూరు నియోజకవర్గంలో భీమారం మండలం ఆరెపల్లి, ఎలకేశ్వరం, నర్సింగాపూర్(బీ), పొలంపల్లి.. జైపూర్ మండలంలో నార్వా, కొత్తపల్లి, అన్నారం, బబ్బేర్చెల్కా, దేవులవాడ, ఏదులబంధం.. కోటపల్లి మండలంలోని లక్ష్మీపూర్, లింగన్నపేట్, నాగంపేట్, నక్కలపల్లి, పార్పల్లి, పుల్లెగాన్, రొయ్యలపల్లి, సర్వాయిపేట, సిర్సా, వెల్మపల్లి, వెంచపల్లి.. మందమర్రి మండలంలోని అదిల్పేట్, బొక్కలగుట్ట.. చెన్నూరు మండలంలో లంబాడీపల్లి, అక్కుపల్లి, అంగ్రాజ్పల్లి, ఆస్నాద్, భవ్రావ్పేట్, బుద్ధారం, చెక్కపల్లి, చింతలపల్లి, ఎర్రగుంటపల్లి, ముత్తారావుపల్లి, ఒతుకులపల్లి, రాచపల్లి, సోమన్పల్లి, సుందార్సాల.
ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలంలో బంగారుతండా, చింతగూడ, చింతపల్లి, హాస్టల్తండా, జన్నారం, కమాన్పల్లి, లింగాయిపల్లి, మర్రిగూడ, రోఠిగూడ, సింగరాజుపేట.
మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి మండలంలో చెల్కగూడ, చింతపల్లి, దండేపల్లి, గుడిరేవు, కర్ణంపేట్, కాసిపేట్, లక్ష్మికంఠాపూర్, లింగాపూర్, మాకుల్పేట్, ముత్యంపేట్, నాగసముద్రం, నర్సాపూర్, నెల్కివెంకటాపూర్, పెద్దపేట్, రెబ్బనపల్లి, తనిమడుగు, తాళ్లపేట్.. హాజీపూర్ మండలంలోని బుద్ధిపల్లి, గుడిపేట, నగరం, టీకన్పల్లి.. లక్షెట్టిపేట మండలంలోని అంకత్పల్లి, దవ్డేపల్లి, జెండా వెంకటాపూర్, కొత్తూర్, లక్ష్మీపూర్, పొత్తపల్లి, సూరారం.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 101 పంచాయతీలకు నూతన భవనాలు మంజూరయ్యాయి. ఇందులో ఆడ దస్నాపూర్, అంకుశాపూర్, చిలాటిగూడ, గోవింద్పూర్, కౌటాగూడ, మానిక్గూడ, వెంకటాపూర్, అంద్గూడ, చింతకర్ర, గౌరి కోలాంగూడ, మాన్కుగూడ, పారా, రాంనాయక్తండా, శివ్నూర్, ఆగర్వాడ, అనంతపూర్, బాబీఝరి, బోరిలాల్గూడ, గోండ్గూడ, ఝరి, కేస్లాగూడ, మొఖదాంగూడ, రింగన్ఘట్, తుమ్మగూడ, చిన్నదాంపూర్, జమ్ముల్దార్, కొత్తపల్లి, లొద్దిగూడ, మమ్మిడిపల్లి, పిట్టగూడ, ధర్మారం, జక్కులపల్లి, కైర్గాం, కోమురవెళ్లి, మాదావాయిగూడ, పులికుంట, రాంపూర్, బాబ్జిపెట్, బుర్నుర్-బి, కోహినూర్-బి, పంగిడి, పుల్హారా, పవర్గూడ, సీతాగోంది, భీంజీగూడ, ఎదులాపహాడ్, గంభీరావ్పెట్, గోవీనా, గుడిపేట్, కౌటాగాం, మార్కగూడ, మోర్రిగూడ, నాయకపుగూడ, తాలండి, ఉల్లిపిట్టడోర్లి, చించుపల్లి, దొడ్డిగూడ, జైత్పూర్, ఖీర్డి, కోమటిగూడ, లెండిగూడ, నావేగాం, పాటగూడ, సామేలా, తేజాపూర్, వాంకిడి కాలన్, అంబఘట్, బారేగూడ, కుకుడా, కుంటాలమానేపల్లి, కుషన్పల్లి, మోగవెల్లి, పెద్దసిద్ధాపూర్, సుశుమీర్, తుమ్మలగూడ, ఆడెపల్లి, హట్టిగూడ, కోయపల్లి, రవీంద్రనగర్-2, భామనగర్, చిన్నరాస్పెల్లి, చౌక్క, గెర్రె, కమ్మర్పల్లి, పెసరికుంట, ఆనుకోడ, బసంతినగర్, భట్పల్లి, దుర్గనగర్, కడంబా, లైన్గూడ, రేగుగూడ, బాలపల్లి, నాగెపల్లి, తాటినగర్, ఆగర్గూడ, లోడ్పల్లి, పొత్తపల్లి,అచ్చెల్లి, కర్జిపల్లి, నావేగాం గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
ఆనందంగా ఉంది..
నార్నూర్, డిసెంబర్ 20 : తెలంగాణ సర్కారు పంచాయతీ ఏర్పాటు చేయడంతో చాలా సంతోషించాం. కార్యాలయ భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరాం. వెంటనే స్పందించిన సర్కారు భవన నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– మడావి సీతాబాయి, సర్పంచ్, ఖాడోడి, గాదిగూడ మండలం.
ఉత్సాహంగా పని చేస్తా..
నూతనంగా ఏర్పాటైన పంచాయతీకి ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు భవనాలు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. పంచాయతీల ఏర్పాటు తరువాత పల్లెలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. చిన్న పంచాయతీలతో గ్రామాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించుకునేందుకు అవకాశం వచ్చింది. శానిటేషన్, మురుగు కాలువల నిర్మాణం, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులు జరుగడంతో పల్లెలు సస్యశ్యామలం అవుతున్నాయి. ప్రభుత్వం నూతన భవనం మంజూరు చేయడంతో కార్యాలయ నిర్వహణ సులభతరం అవుతుంది. కుటుంబానికి సొంత ఇల్ల్లు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో.. పంచాయతీకి కూడా సొంత భవనం ఉంటే పాలకవర్గానికి, సిబ్బందికి ఆనందంగా ఉంటుంది.
– పార్వతీబాయి, సర్పంచ్, అంకుశాపూర్.
నిధులు మంజూరు చేయడం హర్షనీయం..
నార్నూర్, డిసెంబర్ 20 : పంచాయతీ భవనం లేక ఆరు బయట గ్రామసభ లు, సమావేశాలు నిర్వహించాం. ఇప్పడు ఆ సమస్య ఉండదు. కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం హర్షనీయం. కొత్త భవన నిర్మాణం తో ఎలాంటి అవస్థలు ఉండవు. భవనం మంజూరు చేయడం సంతోషంగా ఉంది.
– సలాం ఆనంద్రావ్, సర్పంచ్, ఖంపూర్, నార్నూర్ మండలం.
కేసీఆర్ హయాంలోనే పంచాయతీ నిర్మాణాలు
ముథోల్, డిసెంబర్ 20 : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో కొత్త గ్రామ పంచా యతీలకు నిధులు వస్తున్నాయి. సంక్షేమ పథకాలతోపాటు ప్రతి గ్రామంలో నూతన పంచా యతీలు ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా మండలంలో కొత్త పంచా యతీ భవనాలు మంజూరు చేసింది. బోరిగాంలో రూ. 20 లక్షలతో నూతన పంచాయతీ నిర్మాణం మంజూరు కావడం సంతోషకరం. – ఎర్రం అమృత, సర్పంచ్, బోరిగాం.
స్వరాష్ట్రంలనే సకల సౌకర్యాలు
కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీలకు కొత్త భవనాలు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉంది. కింది స్థాయిలో ప్రజలకు అన్ని అందాలంటే పంచాయతీలే కీలకం. ఇదే ప్రభుత్వం గుర్తించింది. స్వయం పాలన ఉండాలనే కొత్త పంచాయతీలు చేసింది. పాలనను ప్రజలకు చేరువ చేసింది. సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతున్నది. ఇప్పుడు పంచాయతీలకు కొత్త భవనాలు మంజూరు చేసి, మరింత మంచి చేసింది. స్వరాష్ట్రంలనే గ్రామాలు ఆదర్శంగా మారుతున్నయి. సకల సౌకర్యాలు సమకూరుతున్నయ్. పల్లె ప్రగతితో రూపురేఖలు మారిపోయినయ్. పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నది. ఇయ్యాల గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కండ్ల ముందు సాక్షాత్కారమయ్యే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో సర్పంచ్లుగా మా వంతు పాత్ర కచ్చితంగా ఉంటుంది. అందుకే పంచాయతీలకు పక్కా భవనాలు ఉండాలని సర్కారు తలచింది.
– సపాట్ శంకర్, సోమగూడెం(కే) సర్పంచ్,
సర్పంచుల ఫోరం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు
పాలన మరింత చేరువగా..
దస్తురాబాద్,డిసెంబర్ 20 : పాలనా సౌలభ్యం, సత్వర సేవలను అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి దస్తురాబాద్ నుంచి వేరుచేసి పెర్కపల్లెను కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 522 మంది ఓటర్లు ఉన్నరు. ప్రస్తుతం కమ్యూనిటీ భవనంలో గ్రామ పంచాయతీ కార్యాలయం కొనసాగుతున్నది. ఇప్పుడు భవనాన్ని మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉంది. స్వరాష్ట్రంలోనే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి. బీఆర్ఎస్ సర్కారు గ్రామ పంచాయతీలకు నిధులను కేటాయించి,అభివృద్ధికి సహకరిస్తున్నది. కొత్త భవనం ఏర్పడితే పాలన మరింత చేరువైతుంది. ఎమ్మెల్యే రేఖానాయక్ సహకారంతోనే ఈ భవనం మంజూరైంది. ఎమ్మెల్యేకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్న.
– అప్పని ప్రభాకర్,సర్పంచ్,పెర్కపల్లె
స్వరాష్ట్రంలోనే మంచిగైతున్నయ్..
దస్తురాబాద్,డిసెంబర్ 20: తండాలను గుర్తించి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఉమ్మడి గ్రామ పంచాయతీల్లో తండాలు అభివృధ్ధికి నోచుకోలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం, తండాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉమ్మడి మున్యాల గ్రామ పంచాయతీ నుంచి మున్యాల తండాను వేరు వేసి గ్రామ పంచాయతీగా ప్రకటించింది. ప్రసుత్తం తండాలో 416 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగిస్తున్నాం. ఇప్పుడు పక్కా భవనం కట్టుకునేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం ఆనందంగా ఉంది. భవనాన్ని మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రేఖా నాయక్కు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు. స్వరాష్ట్రంలోనే అన్ని మంచిగైతున్నయ్. – నాగవత్ సురేశ్ నాయక్,సర్పంచ్,మున్యాల తండా
ప్రజల కలల సాకారానికి సాక్ష్యం
కుభీర్, డిసెంబర్ 20: ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ధృఢ సంకల్పంతో మండలంలో 20 జీపీలకు 41 జీపీలను చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పాలి. 500 జనాభా కలిగిన గిరిజన తండాలను జీపీలుగా మార్చి ఇప్పుడు 17 జీపీ భవనాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఒక్కో దానికి రూ.20 లక్షలు మంజూరు చేయడం అభినందనీయం. గ్రామ ప్రజలు సమావేశాలు నిర్వహించుకునేందుకు కొత్త భవనాలను నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం పూనుకోవడం శుభపరిణామం. ఎమ్మెల్యే విఠల్రెడ్డి, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు మండల వాసులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా.
– న్యాలపట్ల దత్తూగౌడ్, సర్పంచ్, సాంగ్వి (మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుభీర్)
నేనస్సలు ఊహించలే..
కుభీర్, డిసెంబర్ 20: జీపీ భవన నిర్మాణానికి రూ.20లక్షలు మంజూరు చేయడం హర్షనీయం. పంచాయతీకి పక్కా భవనం లేకుండానే నా పదవీ కాలం ముగిసిపోతుందేమో అనుకుని బాధపడ్డాను. ఇప్పుడు ప్రభుత్వం బిల్డింగ్ మంజూరు చేసింది. నేనస్సలు ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. కుప్టి, వర్ని గ్రామాల ప్రజలందరి తరపున ఎమ్మెల్యే విఠల్రెడ్డికి కృతజ్ఞతలు. పక్కా భవనం ఉంటే పంచాయతీల్లో పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
– గాడేకర్ గంగాబాయి, సర్పంచ్, కుఫ్ట్టి, (మం) కుభీర్
నిధులకు కొదువ లేదు
కుభీర్, డిసెంబర్ 20: రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారు అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. ఈ మధ్య ఇతర పార్టీల నాయకులు డబ్బులు లేవని జీతాలకే ఇబ్బంది ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. పరిపాలనా పరంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అనేక రకాల కార్యక్రమాలతో ముందుకెళ్తున్నది. ప్రభుత్వం దగ్గర నిధులకు కొదవ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జీపీ భవనాలకు నిధులు మంజూరు చేయడం ప్రభుత్వ పనితనానికి నిదర్శనం. మా పంచాయతీ ప్రజల తరపున ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డికి రుణపడి ఉంటాం.
– జాదవ్ శంకర్, సర్పంచ్, డోడర్న తండా 2 (డీఎన్టీ)
కొత్త భవనాలతో సరికొత్త శోభ
కోటపల్లి, డిసెంబర్ 20 : కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీకి ప్రభుత్వం మంజూరు చేసిన భవనాలతో కొత్తరూపు రానుంది. మా గ్రామంలో పక్కా భవనాలు, ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో అద్దె ఇంటిలో గ్రామపంచాయతీని నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం భవనం పూర్తయ్యాక, గ్రామస్తులకు అన్ని పనులు ఇక్కడే అందుతాయి. మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. ఇప్పుడు భవనం కూడా అందుబాటులోకి రావడం మాకు మరింత ఉత్సాహానిచ్చింది.
– దాగామ రాజయ్య, సర్పంచ్, లింగన్నపేట (కోటపల్లి)