కాసిపేట, డిసెంబర్ 20 : వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుర్రేగఢ్ గ్రామంలో బుధవారం పాహుండి కూపర్ లింగు స్వామి, భీమన్న దేవుడి సట్టి పూజలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాలతో, డోలు వాయిద్యాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
అనంతరం కాలినడకతో గోదావరికి వెళ్లి స్నానాలు ఆచరించారు. భీమన్న దేవుడికి చిక్కుడు, కంది, అనుము కాయలతో పాటు కొత్త పంటలను నైవేద్యంగా పెట్టి మొక్కలు చెల్లించారు. ఈ కార్యక్రమంలో కుర్సింగ భూదేశావ్ స్వామి, మాధవరావు, ఈశ్రు, పెందూర్ ప్రభాకర్, వల్క శ్రీను, రాము పటేల్, ఆడె జంగు పటేల్, తదితరులు పాల్గొన్నారు.