శ్రీరాంపూర్, ఏప్రిల్ 11 : శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరునక్కనగర్లో బుధవా రం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్ఐ సంతోష్, సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు ఇంటింటా సోదాలు నిర్వహించారు.
అనుమతి పత్రాలు లేని వాహనాలను పట్టుకొని జరిమా నా విధించారు. ఎస్ఐ సంతోష్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, యువకులు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.