నిర్మల్ జిల్లా మామడ ఎస్ఐ రాజు స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఆదివారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మామడ మండలంలోని అనంతపేట్ గ్రామానికి చెందిన సల్కం సతీష్, సుదర్శన్లు అదే గ్రామానికి చెందిన సోప్పరి నరేశ్ ఈనెల 24న గొడవ పడ్డారు.
నరేశ్ వీరిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. వీరికి పోలీసుస్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్ఐ రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సతీష్ సోదరుడు తిరుమల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు వలపన్నీ ఎస్ఐ రాజును పోలీసుస్టేషన్లో రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకొని కేసు నమోదు చేశారు.
– మామడ, అక్టోబర్ 29