ఎదులాపురం, అక్టోబర్ 16 : సెలవు దినం కావడం తో సరదాగా బయటకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల మేరకు.. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగివాగులో ఇద్దరు యువకులు ఆదివారం గల్లంతయ్యారు.
ఆదిలాబాద్ పట్టణం బొక్కలగూడ కాలనీకి చెందిన షేక్ ఆత్మస్ ఖాన్(26), దివ్యాంగుల కాలనీకి చెందిన సయ్యద్ షాహిద్(28) ఇద్దరుమిత్రులు. ఆదివారం కావడంతో సరదాగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగి వాగులో స్నానాని కి వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరు వాగులో గల్లంతయ్యా రు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్ఐ.. ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా ఇద్దరి మృతదేహలు లభ్యమయ్యాయి. ఇద్దరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.