భీంపూర్, జనవరి 3: మండలంలోని పెన్గంగ ఒడ్డున ఉన్న సరిహద్దు గ్రామం గుబ్డికి మంగళవారం ఆర్టీసీ బస్సు పునఃప్రారంభమయ్యింది. కరంజి(టీ) నుంచి గుబ్డి వరకు 8 కిలోమీటర్ల వరకు ఉన్న రోడ్డులో కొంతమేర బాగా లేక ఇన్నాళ్లూ బస్సు వేయలేదు. దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఇటీవల ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్కు విన్నవించారు.
దీంతో ఆయన తాత్కాలిక పనులకు సొంతంగా రూ. 50 వేలు అందించగా మరమ్మతులు చేపట్టా రు. మంగళవారం బస్సురాకతో గ్రామస్తులు బ స్సుకు పూజలు చేశారు. డ్రైవర్, కండక్టర్కు పుష్పగుచ్ఛాలు అందించారు. సర్పంచ్ ఎల్పుల ప్రతాప్ యాదవ్, ఉప సర్పంచ్ ఆకం శ్రీనివాస్యాదవ్, గ్రామపెద్దలు గడ్డం భూమారెడ్డి, బొలినెల్లి సంతోష్యాదవ్ , తూడి దత్తు యాదవ్, వినోద్, విఠల్ తదితరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.