ఎదులాపురం, జూన్ 2 : పోలీసు శాఖలో సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ఆరుగురు అధికారులను ఆదిలాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి శాలువాలు, పూలమాలలతో సతరించి జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, విరమణ పొందిన అధికారులు శాఖ అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఉద్యోగ విరమణ పొందిన అధికారులు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, ఎస్ఐ, ఆదిలాబాద్ రూరల్ పీఎస్ ఎండీ అలీమ్, ఎస్ఐ, టూ టౌన్ నిమ్మని ముకుందరావు, ఏఆర్ఎస్ఐ, ఏఆర్ హెడ్ క్వార్టర్స్ జాదవ్ గుణవంతరావు, హెడ్ కానిస్టేబుల్ భీంపూర్ పోలీస్ స్టేషన్ ఎగిడివార్ విటల్, హెడ్ కానిస్టేబుల్ ఉట్నూర్ పోలీస్ స్టేషన్ గాయక్వాడ్ దాదారావు ఉన్నారు. ఆదిలాబాద్ పోలీస్ ముఖ్య కార్యాలయ అడ్మిన్ పీ మౌనిక ఐపీఎస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డీ వెంకటి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, సీసీ కొండరాజు, పాల్గొన్నారు.