ఉట్నూర్, జనవరి 26: గిరిజనుల ఆరాధ్య దైవం జై జంగో.. జైలింగో పవిత్ర స్థలమైన సిద్ధికాస, కప్లయ్ పుణ్యక్షేత్రాలకు రోడ్డు, ఇతర సౌకర్యాలు కల్పించాలని మాలధారులు బుధవారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను కలిసి విన్నవించారు. ఇక్కడ ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్ రావ్, జై జంగో.. జైలింగో సంస్థాన్ సభ్యులు పెందూర్ పుష్పా రాణి, న్యాయవాది పెందూర్ ప్రభాకర్, మంగం విశ్వం, బాపురావ్, ఆడ హన్మంత్రావ్ ఉన్నారు.