ఇంటర్ పరీక్షలకు ఇక మూడు రోజులే మిగిలి ఉంది. ఈ నెల 15న మొదటి సంవత్సరం, 16న రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతుండగా, యంత్రాంగం పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 97 కేంద్రాలు కేటాయించగా, ప్రతిచోటా సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షించనున్నది. మొత్తం 59,187 మంది విద్యార్థులు హాజరుకానుండగా, నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమంటూ హెచ్చరిస్తున్నది. ఇక పిల్లల్లో మానసిక ైస్థెర్యం నింపేందుకు ప్రత్యేకంగా టోల్ఫీ నంబర్ 14416ను అందుబాటులోకి తెచ్చింది.
– సారంగాపూర్, మార్చి 11
సారంగాపూర్, మార్చి 11 : ఈ నెల 15వ తేదీనుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండగా, పకడ్బందీగా నిర్వహించేందు కు బోర్డు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పరీక్షా కేంద్రా ల్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా రు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిం చి, సందేహాలను అధ్యాపకులు నివృత్తి చేస్తున్నారు. సమయం తక్కువగా ఉండడంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
242 కళాశాలలు.. 59,187 మంది విద్యార్థులు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 242 ప్రభుత్వ, ప్రైవేట్, సెక్టార్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొత్తం 59,187 మంది విద్యార్థులు ఉండగా, ప్రథమ సంవత్సరం(జనరల్, ఒకేషనల్)లో 24,729 మం ది, ద్వితీయ సంవత్సరం(జనరల్, ఒకేషనల్)లో 29,908 మంది వి ద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రథమ సంవత్సరం, 16వ తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 97 పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, వైద్య సౌకర్యంతో పాటు మూత్రశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా కళాశాలల్లో విద్యార్థులకు హాల్టికెట్లను ప్రిన్సిపాళ్లు అందజేయనున్నారు. టీఎస్బీఐఈ వెబ్సైట్లో హాల్టికెట్ను డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరుకావచ్చు.
నిమిషం నిబంధన అమలు..
ఇంటర్ వార్షిక పరీక్షలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించవద్దన్న నిబంధన ఉంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి 8.30 గంటలకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 9 గంటలకు పరీక్ష ప్రశ్నపత్రాన్ని అందిస్తారు. 9 గంటలకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష రాయడానికి అనుమతించారు. విద్యార్థులు తమ వెంట సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి ఉండదు.
సీసీ కెమెరాల నిఘాలో..
సీసీ కెమెరాలు ఉన్న కాలేజీలనే ఇంటర్ బోర్డు పరీక్షా కేంద్రాలను గుర్తించింది. ప్రతీ పరీక్ష కేంద్రంలో ప్రిన్సిపాల్ కార్యాలయంలో సీసీ కెమెరాల పర్యక్షణలో మాత్రమే ప్రశ్నాపత్రం ప్యాకెట్లు తెరువబడుతాయి. సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో మాత్రమే సీసీ కెమెరాల సమక్షమంలో సమాధాన పత్రాల బార్కోడ్ స్కానింగ్, ప్యాకింగ్ పనులన్నీ నిర్వహించబడుతాయి.
టోల్ఫ్రీ నంబర్ 14416
ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పరీక్షల సందర్భంగా విద్యార్థుల మానసిక సమస్యలు దూరం చేయడానికి ప్రత్యేక టోల్ఫ్రీ నంబర్ 14416ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఎదుర్కొనే మానసిక సమస్యలు ఎవరితో చెప్పుకోలేక బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో వారిలో ఆత్మైస్థెర్యం నింపేందుకు ఇది దోహదపడనున్నది.
పకడ్బందీగా ఏర్పాట్లు
ఈ నెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకాబోతున్నాయి. పకడ్బం దీగా ఏర్పాట్లు చేస్తున్నాం. నిర్మల్ జి ల్లాలో 23 కేంద్రాల్లో 15,201 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. విద్యుత్, తాగునీటితో పాటు అన్ని వస తులు కల్పిస్తున్నాం. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముం దుగానే చేరుకోవాలి. పరీక్షకు వచ్చేటప్పుడు విద్యార్థులు సెల్ఫోన్, ఎ లక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకుడదు. కళాశాలలో విద్యార్థులు ప్రి న్సిపాల్ వద్ద హాల్టికెట్లు తీసుకోవాలి. సీసీ కెమెరాల ద్వారా పరీ క్షలను పర్యవేక్షిస్తాం.
– జాదవ్ పరశురాం, డీఐఈవో, నిర్మల్ జిల్లా