ఇంద్రవెల్లి, జనవరి 30 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబా జాతర నేటి అర్థరాత్రి మెస్రం వంశీయుల ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభం కానున్నది. ఇప్పటికే మెస్రం వంశీయులు జన్నారం మండలం హస్తలమడుగు నుంచి పవిత్ర గోదావరి జలాలను తీసుకు వచ్చి ఆలయ సమీపంలోని మర్రి చెట్ల కింద సేదతీరారు. వారం పాటు జాతర కొనసాగనున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగే సమ్మక్క, సారలమ్మ, జాతర తర్వాత రెండో అతిపెద్దదైన జాతర కావడంతో తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, ఒడిస్సా రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తు లు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
గంగాజలంతో అభిషేకం..
అమావాస్య రోజు అర్ధరాత్రి ఆరాధ్య దైవం నాగోబాకు గంగాజలంతో జలాభిషేకం చేసి మెస్రం వంశీయులే మహాపూజలు నిర్వహిస్తారు. మెస్రం వంశీయుల తుమ్ పూజలు పవిత్ర గంగాజలంతో మర్రిచెట్ల వద్ద కుటుంబసమేతంగా బసచేస్తున్న మెస్రం వంశీయులు శనివారం రాత్రి 126మంది పేరిట తుమ్ పూజలు నిర్వహించారు. మెస్రం వం శీయుల్లో చనిపోయిన వారి పేరిట యేటా నా గోబా జాతర సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతామని పెద్దలు తెలిపారు. తర్వాత మర్రిచెట్లకు కొద్ది దూరంలో అర్ధరాత్రి పతిభగ్వన్ పూజలు ని ర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మెస్రం వ ంశీయులు మర్రి చెట్ల నుంచే నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నైవైద్యాలను సమర్పించి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, బాధిరావ్పటేల్, లింబారావ్పటేల్, కటోడ మెస్రం కోసురావ్, ప ర్ధాంజీ మెస్రం దాదారావ్, నాయికి ధర్ము, కటోడ మెస్రం హనుమంత్రావ్, కటోడ మెస్రం కోశారావ్, కొత్వాల్ మెస్రం తిరుపతి, మెస్రం వంశీయులు దేవ్రావ్, సోనేరావ్, నాగ్నాథ్, తుకా రాం, ఆనంద్రావ్, జంగు, శేఖర్బాబు, పాండురంగ్, గణపతి, ధర్ము, పాల్గొన్నారు.
ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు
ఇంద్రవెల్లి, జనవరి30: నాగోబా జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం ఏ ర్పాట్లు చేసింది. మిషన్ భగీరథ పథకం ఇంజినీరింగ్ అధికారి నిరంజన్, వాటర్గ్రిడ్ అధికారి మ నోజ్, సిబ్బంది పృథ్వీరాజ్, తారాసింగ్ నీటి సమ స్య లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో పారిశుధ్యంతో పాటు తదితర పనులు చేపట్టారు.
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
భక్తులతోపాటు మెస్రం వంశీయులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని జడ్పీటీసీ ఆర్కా పుష్పలత అన్నారు. జాతరలో ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు రాజలింగు, మరప రాజు, సుధీర్, రాథోడ్ భీంరావ్, తదితరులు పాల్గొన్నారు.
భారీ పోలీస్ బందోబస్తు…
నాగోబా జాతరను పురస్కరించుకొని జాతరలో ఉట్నూర్ ఏఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీఎస్పీలతో పాటు 10 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలు, ప్రత్యేక బలగాలు, అన్ని రకాల ఫోర్స్ బలగాలు 500 మందిని ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ నందిగామ నాగ్నాథ్ తెలిపారు. ప్రత్యేకంగా షీ టీంలతో పాటు మహిళా పోలీసులను సైతం జాతరలో విధుల్లో ఉంటారని తెలిపారు.