తాంసి, నవంబర్ 1 : బీఆర్ఎస్తోనే ఆదివాసీ, గిరిజనులకు ప్రత్యేక గుర్తింపుతో పాటు గ్రామాల అభివృద్ధి జరిగిందని జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డి అన్నారు. మండలంలోని అంబుగాం, లింగూడ, గిరిగామ, అట్నంగూడ గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా జాదవ్ అనిల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్లు స్వప్న రత్న ప్రకాష్, సదానందం, వెంకన్న, తూర్పుబాయి యశ్వంత్, అండె అశోక్, అలాలి జ్యోతి నర్సింగ్, కుంట సరిత కేశవ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, రజినీకాంత్ రెడ్డి, పరమేశ్, సునీల్, గడుగు గంగన్న, గోవర్ధన్ రెడ్డి, వెంకట రమణ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్చైర్మన్ ధనుంజయ్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు దయానంద్, కార్యకర్తలు పాల్గొన్నారు.
బోథ్, నవంబర్ 1: బోథ్ గ్రామ పంచాయతీ పరిధిలోని వార్డుల్లో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు మళ్లీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పనులు, పథకాలను నాయకులు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో పీఏసీఎస్ చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్ సురేందర్యాదవ్, శ్రీధర్రెడ్డి, అల్లకొండ ప్రశాంత్, బొడ్డు శ్రీనివాస్, మహిపాల్, రాజేశ్వర్, రోహిదాస్, జుగాదిరావ్, విజయ్, శ్రీనివాస్, సోలంకి సత్యనారాయణ, వినయ్, రాకేశ్, హరీశ్, కృష్ణ, ప్రదీప్, మహిళలు పాల్గొన్నారు. పిప్పల్ధరి గ్రామంలో సర్పంచ్ బీ శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ ఉయిక భీంరావ్, నాయకులు కేసీఆర్ మాస్కులు ధరించి ఇంటింటి ప్రచారం చేశారు. జీడిపల్లె, హనుమాన్తండాల్లో ఆత్మ చైర్మన్ సుభాష్, రమణాగౌడ్, ఎస్ వెంకటరమణ, దేవీదాస్ ఇంటింటి ప్రచారం చేశారు.
నేరడిగొండ, అక్టోబర్ 1 : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అందని ఇల్లులేదని బీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. నేరడిగొండలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ ఎలేటి మహేందర్రెడ్డి, సర్పంచ్ పెంట వెంకటరమణ, విశాల్ కుమార్, నాయకులు లచ్చన్న, సురేందర్, రాజేశ్వర్, మండాడి కృష్ణ, ఆత్రం భీంరావ్, మదన్సింగ్, ప్రతాప్సింగ్, అడెల్లు, గులాబ్సింగ్, కరణ్సింగ్, మద్దెల నారాయణ, సరసాని మహేందర్రెడ్డి, జాదవ్ కపిల్దేవ్, జాదవ్ గణేశ్, జాదవ్ వసంత్, కార్యకర్తలు పాల్గొన్నారు.
భీంపూర్, నవంబర్ 1 : బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ను గెలిపించాలని కోరుతూ భీంపూర్ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, బీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, నాయకులు బుధవారం ధనోరా గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. రైతులు, కులవృత్తుల వారికి బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలు వివరించారు. కార్యక్రమంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ బక్కి గోవర్ధన్యాదవ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ అనిల్, సర్పంచ్లు బక్కి అజయ్యాదవ్, నిమ్మ వేణుయాదవ్, మడావి లింబాజీ , కరీం, బాదర్, ఉపసర్పంచ్లు మట్ట కిరణ్యాదవ్, జాదవ్ రవీందర్, నాయకులు బక్కి సురేందర్, జీ నరేందర్ యాదవ్, షేక్ అఫ్రోజ్, జహూర్ అహ్మద్, ఎం కల్చాప్యాదవ్, గోప మహేందర్, గోప సుభాష్, శంకర్, గంగన్న, పెంటపర్తి లస్మన్న, దేరడ్డి శ్రీనివాస్, కపిల్, సవాయి స్వామి పాల్గొన్నారు.
సొనాల, నవంబర్ 1 : సొనాలలో బీఆర్ఎస్ నాయకులు గడపగడపకు ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో సర్పంచ్ సదానందం, నాయకులు శంకర్, జీవన్, సంతోష్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్ , నవంబర్ 1: సీఎం కేసీఆర్ తెలంగాణ భవితకు భరోసా అని బీఆర్ఎస్ మండల యువజన సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తలమడుగు, నవంబర్ 1: కుచులాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.