HomeAdilabadThe Weather Has Warmed Up Once Due To The Intense Sun For Four Days
భానుడి భగభగ
భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. నాలుగు రోజులుగా తీవ్రమైన ఎండ కారణంగా వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. వేడిగాలులు, ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు.
నిప్పుల కొలిమిలా మంచిర్యాల
అధికంగా 45.9 డిగ్రీలు
చుట్టూ దట్టమైన అడవి.. ఎత్తైన గుహ.. అతిపెద్ద సొరంగం.. నీటి కొలను.. పాల నురుగలా జాలువారే నీటి ధారలు.. ఇవీ అర్జున్లొద్ది ప్రాంతంలో కనిపించే సుందర దృశ్యాలు.. ప్రకృతి సోయగాలతో చూడముచ్చటైన ఈ పరిసరాలను తిలకించేందుకు సందర్శకులు నిత్యం తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో స్వరాష్ట్రంలో పురాతన ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్న రాష్ట్ర సర్కారు, ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని గిరిజనులు కోరుతున్నారు.
– తిర్యాణి, మే 15
మంచిర్యాల టౌన్, మే 15 : భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. నాలుగు రోజులుగా తీవ్రమైన ఎండ కారణంగా వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. వేడిగాలులు, ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అవసరం అయితే తప్ప జనం బయటకు రావడం లేదు. సోమవారం గరిష్ఠంగా 45.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిత్యం రద్దీగా ఉండే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రహదారులు మధ్యాహ్నం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఐబీ చౌరస్తా, లక్షెట్టిపేట రోడ్డు, మందమర్రి వైపునకు వెళ్లే రహదారులు వెలవెల బోతున్నాయి. కొందరు తలకు చేతి రుమాలు, తువ్వాలను కట్టుకుంటున్నారు. శీతల పానియాలు, కొబ్బరిబొండాలను తాగుతున్నారు. ఐస్ క్రీములను తింటున్నారు.