ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డు నంబర్ 33 శాంతినగర్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పలువురికి కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలపై చైర్మన్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అజయ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జైనథ్ మండలం దీపాలయిగూడలో..
ఎదులాపురం (జైనథ్), ఫిబ్రవరి16 : మండలంలోని దీపాయిగూడలో కంటివెలుగు శిబిరాన్ని సర్పంచ్ బొల్లు గంగన్న ప్రారంభించారు. పరీక్షల కోసం వచ్చే వారు ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ నైనాత, ఎంపీటీసీ లోక కరుణాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ లోక కృష్ణారెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
భీంపూర్ మండలం అంతర్గాంలో..
భీంపూర్, ఫిబ్రవరి 16 : మండలంలోని అంతర్గాంలో మూడో రోజు కంటి వెలుగు శిబిరం నిర్వహించారు. 115 మందికి కంటి పరీక్షలు చేసి, 17 మందికి అద్దాలు అందజేశారు. 17 మంది కోసం ప్రత్యేక అద్దాలకు ఆర్డర్ చేశారు. కంటి ఆపరేషన్లకు 25 మందిని గుర్తించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్, సిబ్బంది గంగాధర్, రవీందర్, నర్సయ్య, శ్రీకాంత్, నఫీజ, భాగ్యవతి, అనసూయ, కవిత పాల్గొన్నారు.
ఉట్నూర్ మండలంలో..
ఉట్నూర్ రూరల్, ఫిబ్రవరి 16: కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం కొనసాగుతున్నది. మండలంలో దంతన్పెల్లి, హస్నాపూర్, శ్యాంపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలోని గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. శ్యాంపూర్ పీహెచ్సీలో వైద్యుడు సందీప్ రాథోడ్ పలువురికి కంటి పరీక్షలు నిర్వహించారు. దంతన్పెల్లి పీహెచ్సీ పరిధిలోని ఉట్నూర్లో వైద్యుడు కొండగొర్ల సంతోష్కుమార్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. హస్నాపూర్ పీహెచ్సీలో వైద్యురాలు విజయలక్ష్మి కంటి పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు మూడు పీహెచ్సీల పరిధిలో సుమారు 8,545 మంది కంటి పరీక్షలు చేయించుకోగా.. 2,355 మందికి కంటి అద్దాలు అందజేశారు.
పరీక్షలు చేయించుకోవాలి
నార్నూర్, ఫిబ్రవరి 16 : ప్రతి ఒక్కరూ కం టి పరీక్ష చేయించుకోవాలని సర్పంచ్ సిడాం జంగు అన్నారు. గాదిగూడ మండలం పర్సువాడ(బీ) గ్రామంలో గురువారం కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురికి కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపాన్ని గుర్తిం చి మందులు, కళ్లజోళ్లను ఉచితంగా అందించారు. కంటి సమస్యతో బాధపడుతున్న వారందరూ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిడాం దేవ్రావ్, వైద్యురాలు స్నేహ, హెచ్ఈవో పవార్ రవీందర్, సిబ్బంది ఉన్నారు.