నిర్మల్ జిల్లాలో నీలి విప్లవం వెల్లివిరుస్తున్నది. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర సర్కారు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. ఏటా చెరువులు, జలాశయాల్లో వదులుతుండగా.. చేపలను విక్రయిస్తూ మత్స్యకారులు మెరుగైన ఉపాధి పొందుతున్నారు. ఈ యేడాది కూడా 4.75 కోట్లు పంపిణీ చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు టెండర్లు ఆహ్వానించగా.. పలువురు టెండర్లు దాఖలు చేశారు. ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే నెలాఖరు నాటికి చెరువులు, రిజర్వాయర్లలో వదలనున్నారు. పంపిణీ ప్రక్రియ కాగానే.. 90 లక్షల రొయ్య పిల్లల విడుదలకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దీనికితోడు సబ్సిడీపై వాహనాలు అందిస్తుండగా.. బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నది. ప్రధానంగా ఉచితంగా చేప పిల్లలు, రొయ్యల పంపిణీతో మత్స్య సంపద గణనీయంగా పెరుగుతుండగా.. మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– నిర్మల్, మే 18(నమస్తే తెలంగాణ)
నిర్మల్, మే 18(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలోని 19 మండలాల పరిధిలో 644 చెరువు లతోపాటు ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టు లు ఉన్నాయి. వీటిలో వచ్చే వర్షాకాలంలో 4.75 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ అధికారులు ప్రతిపాదించారు. వీటికి ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు చేప పిల్లలను సరఫరా చేసే కాంట్రాక్టర్ల కోసం టెండర్ల ప్రక్రియ నిర్వహించగా.. పలువురు టెండర్లు దాఖలు చేశారు. త్వరలోనే ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే నెలాఖరు నాటికి వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, రిజర్వాయర్లలో కొత్త నీరు చేరగానే చేప పిల్లలను వదలనున్నారు. ఇందులో ప్రధానంగా బొచ్చె, రవు, బంగారుతీగ రకాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
13,300 కుటుంబాలకు లబ్ధి
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 214 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 62 మహిళ, మూడు గిరిజన సహకార సంఘాలు, ఒక మార్కెటింగ్ సొసైటీలు పని చేస్తున్నాయి. ఈసారి కొత్తగా ఆయా సంఘాల నుంచి మరో 200 మందికి సభ్యత్వం ఇచ్చారు. మొత్తం 13,300 మంది సభ్యుల్లో 3,500 మంది మహిళలు ఉన్నారు. 152 పురుష మత్స్య సహకార సంఘాల్లోని సభ్యులు చేపలు పడుతుండగా.. వీటిని 62 మహిళా సంఘాల్లోని సభ్యురాళ్లు కొనుగోలు చేసి మార్కెట్లో విక్ర యించి ఉపాధి పొందుతున్నారు.
90 లక్షల రొయ్య పిల్లల విడుదలకు ప్రణాళిక
చేపపిల్లల విడుదల ప్రక్రియ పూర్తి కాగానే వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎంపిక చేసిన చెరు వుల్లో రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు అధికా రులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ యేడు కూడా సుమారు 90 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయాలని నిర్ణయిం చారు. జిల్లాలోని ఎస్సారెస్పీ, కడెం, గడ్డెన్న వాగు ప్రాజెక్టులతోపాటు భైంసా మండలంలోని కిరాల గ్రామ శివారులో గల రామ సముద్రం చెరువులో విడుదల చేయనున్నారు. ప్రధానంగా ఉచిత చేప పిల్లలు, రొయ్యల పంపిణీతో మత్స్య సంపద గణ నీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుండడంతో మత్స్య కారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సబ్సిడీపై వాహనాలు
నిర్మల్ జిల్లాలోని మత్స్యకారులకు 75 శాతం సబ్సిడీపై 1,849 మందికి ద్విచక్ర వాహనాలు, 1,427 మందికి వలలను అందజేశారు. అలాగే 73 మందికి లగేజీ ఆటోలు, 23 మందికి మొబైల్ ఫిష్ ఔట్లెట్లు, ఇద్దరికి హైజెనిక్ ట్రాన్స్పోర్ట్ వాహ నాలు, మరో ఇద్దరికి ట్రక్కులను అందించారు. దీంతో పాటు మత్స్యకారుల కుటుంబాలను ఆదు కునేందుకు ప్రభుత్వం గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా వర్తింపజేస్తున్నది. 10 వేల మందికి బీమా వర్తించేలా జాబితా రూపొందించారు. ఇప్పటి వరకు 20 మంది మత్స్యకారులు ప్రమాదవశాత్తు మృతి చెందగా, నలుగురికి రూ.5 లక్షల చొప్పున రూ.20 లక్షలు నామినీల ఖాతాలో జమ చేశారు. మిగతా వారికి త్వరలోనే బీమా సాయం అందు తుందని అధికారులు చెబుతున్నారు.
అండగా ప్రభుత్వం..
తెలంగాణ ప్రభు త్వం మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీపై పూర్తి ఉచితంగా చేప పిల్లలను, రొయ్య పిల్లల ను అందజేస్తూ వారికి అండగా నిలు స్తున్నది. మత్స్యకారు లకు, వారి కుటుంబాలకు ప్రమా ద బీమా కల్పిస్తున్నది. టూ, ఫోర్ వీలర్స్, ఇన్సులే టెడ్ వాహనాలు, వలలు, సంచార చేపల విక్రయ వాహనాలను అందజేశాం. తాజాగా మరి న్ని పథకాల అమలుకు అర్హుల నుంచి దరఖా స్తులు స్వీకరిస్తున్నాం. చేపల చెరువుల ఏర్పాటు కోసం రూ.7 లక్షలు, మొబైల్ వాహనాల కోసం రూ.10 లక్షలు, ఆటోల కోసం రూ.3 లక్షలను అంద జేయనున్నాం.
– బీ నరసింహారావు, జిల్లా మత్స్య శాఖ అధికారి(నిర్మల్)