జై నూర్ : నర్సరీలో నాటిన మొక్కలను సంరక్షించాలని జై నూరు మండల ఎంపీడీవో సుధాకర్ రెడ్డి ( Sudhakar Reddy ) అన్నారు. మండలంలోని పానాపాటార్ గ్రామపంచాయతీలో సోమవారం ఆయన పలు నర్సరీలను సందర్శించి సూచనలు చేశారు. వాతావరణ సమతుల్యతకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని అన్నారు. నర్సరీలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మొక్కలు ఎదిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం పీఎంఏవై ఇండ్ల నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను కోరారు. గ్రామపంచాయతీలో నెలకొన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీవో బి.మోహన్, సర్పంచ్ ఆత్రం తులసి శంకర్ కోలం, పంచాయతీ కార్యదర్శి జాడీ కైలాస్, గ్రామస్థులు ఆత్రం భలే రావు, లక్ష్మణ్ వినాయకరావు, భీమ్రావు, రాంశావ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.