స్మార్ట్ఫోన్ పోయినా.. చోరీకి గురైనా ఆ బాధ వర్ణణాతీతం. పోగొట్టుకున్న వారంతా మొబైల్ కోసం కాకుండా అందులోని డేటా కోసం తపన పడుతున్నారు. ఈ రోజుల్లో విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, బ్యాంకింగ్, రాజకీయం వంటి ప్రతి సమాచారాన్ని మొబైల్లోనే నిక్షిప్తం చేసుకుంటున్నారు. వ్యక్తిగత, ఆఫీస్ సమాచారాన్ని కూడా సాఫ్ట్కాపీల రూపంలో భద్రపర్చుకుంటున్నారు. ఒక్క మాటల్లో చెప్పాలంటే దైవందిన జీవితంలో ఫోన్ కీలకంగా మారింది. ఈ క్రమంలో స్మార్ట్ఫోన్ పోయినా.. పోగొట్టుకున్నా.. డేటా చోరీకి గురైనా సున్నితమైన అంశాలు బయటికొచ్చే ప్రమాదం ఉంది. అందుకే రాష్ట్ర పోలీసు శాఖ వినూత్న సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సెంట్రల్ ఈక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్). ఈ టెక్నాలజీ ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లాలో 25 ఫోన్లను రికవరీ చేసి, బాధితులకు అప్పగించారు. ఈ క్రమంలో సీఈఐఆర్
ఎదులాపురం, మే 11 : మారుతున్న జీవనశైలికి అనుగుణంగా వచ్చిన మార్పుల్లో సెల్ఫోన్ ప్రధానమైంది. ప్రస్తుతం మనిషి ఫోన్తోనే అన్ని పనులు చక్కబెడుతున్నాడు. దరఖాస్తు చేయాలన్నా, డబ్బులు, లావాదేవీలు ఆన్లైన్లో చెల్లించాలన్నా.. సెల్ఫోన్పైనే ఆధారపడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో సెల్ఫోన్ పోతే ఎలా గుర్తించాలో తెలియక చాలా మంది సతమతం అవుతున్నారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఈఐఆర్ ప్రత్యేక అప్లికేషన్ ద్వారా సెల్ఫోన్ ఎక్కడ ఉందో సులభంగా గుర్తించవచ్చు ఈ ప్రత్యేక యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
మీ సెల్ఫోన్ను పోలీసులు పట్టుకున్నా.. లేక మీకే దొరికినా.. మీ పాత ఐడీ, ఫోన్ నంబర్, ఇతర వివరాలు నింపినా ఫోన్ అన్బ్లాక్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీకు ఐఎంఈఐ నంబర్ తెలియకపోయినా, గుర్తు లేక పోయినా తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నుంచి *#06# డయల్ చేయగానే మీ మొబైల్ నంబర్పై దాని ఐఎంఈఐ నంబర్ ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ ఫోన్ పోగొట్టుకుంటే ఫోన్ కొన్నబాక్స్, కొనుగోలు చేసిన దుకాణంలో ఉన్న ఇన్వాయిస్ బిల్లు ద్వారా కూడా ఐఎంఈఐ నంబర్ను పొందవచ్చు.
ఇక నుంచి ఫోన్ పోగొట్టుకున్నా ఆందోళన అవసరం లేదు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సీఈఐఆర్ అనే అప్లికేషన్ ద్వారా గుర్తించవచ్చు. ఈ టెక్నాలజీపై అన్ని స్టేషన్ల రైటర్లకు శిక్షణ ఇచ్చా రు. ఇక సెల్ఫోన్ వినియోగదారులకు అవగాహన కల్పించేందు కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సీఈఐఆర్ యాప్, వెబ్సైట్, ఫోన్ పోయినా దొంగిలించబడ్డ వెంటనే ఫిర్యాదు చేస్తే మొబైల్ సిగ్నల్స్ను ట్రేస్ చేసి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంటున్నారు. అనంతరం బాధితులకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 25 ఫోన్లను అందించామని పోలీసులు తెలిపారు.
కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపొందించి న సెంట్రల్ ఈక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(సీఈఐఆర్) ద్వా రా పోయిన సెల్ఫోన్ను కనిపెట్టే సాంకేతికతను పరిచయం చే స్తున్నారు. మొదటగా సీఈఐఆర్ వెబ్సైట్ ఓపెన్ చేసి బ్లాక్ చే యవచ్చు. వెబ్సైట్లోకి వెళ్లి సెల్ఫోన్ను ఐఎంఈఐ నంబర్ సా యంతో బ్లాక్ చేయవచ్చు. ఆ తర్వాత ఆ సెల్ఫోన్ పని చేయ దు. ఒకవేళ ఫోన్ ఆన్చేసి అందులో కొత్త సిమ్ వేసినా.. ఆ విష యం ఫోన్ యజమానికి ఎస్ఎంఎస్ రూపంలో తెలుస్తుంది.
సెకండ్ హ్యాండ్, వెబ్సైట్, తెలిసిన వారి నుంచి ఫోన్కొనాల్సి వచ్చినప్పుడు అది దొంగిలించిందా? బ్లాక్ లిస్టులో ఉందా? అనే విషయాన్ని మనం కేవైఎం(నో యువర్ మొబైల్) విధానంలో ముందే తెలుసుకోవచ్చు.
ఇందుకోసం మొబైల్ తీసుకొని కేవైఎం విధానంలోనూ ఐఎంఈఐ నంబర్ను తెలుసుకోవచ్చు. అందుకోసం కేవైఎం అని పెద్ద అక్షరాల్లో టైప్ చేయాలి. అనంతరం 15 అక్షరాల ఐఎంఈఐ నంబర్ను టైప్ చేసి 14422 నంబర్కు ఎస్ఎంఎస్ పంపాలి.
కేవైఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది. ఇంకా.. సీఈఐఆర్ వెబ్ సైట్లోనూ ఆఖరిగా ఇచ్చిన ఆప్షన్ ద్వారా కూడా ఫోన్ను పరిశీలించుకోవచ్చు.
ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన యూసుఫ్ ఏప్రిల్ 7న ఫోన్ పోయింది. సీఈఐఆర్ విధానాన్ని తెలుసుకున్న ఈయన అదేరోజు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఇచ్చిన
24 గంటల్లోనే ఫోన్ను బాధితుడికి డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు అందించారు.
ఆదిలాబాద్ పట్టణంలోని మావల పోలీస్స్టేషన్ పరిధిలో గల న్యూహౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన చౌహన్ రమేశ్ ఏప్రిల్లో తన మొబైల్ పోగొట్టుకున్నాడు. మే 4న సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. 24 గంటల్లోనే ఫోన్ దొరికింది. ఇందులో చాలా డేటా ఉందని, అది కూడా సురంక్షితంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తూ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
మీ ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా సీఈఐఆర్లో ఫిర్యాదు చేస్తే చాలు. పోయిన ఫోన్ను ట్రేస్ చేసి 24 గంటల్లోనే బాధితుడికి అందజేస్తాం. ఒక వేళ మీకు సీఈఐఆర్లో ఫిర్యాదు చేయడం తెలియకపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే చాలు. బాధితులు ఫోన్ పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేయడం మంచిది. పోగొట్టుకున్న ఫోన్ ఇతర రాష్ర్టాలకు వెళ్తే తీసుకురావడం ఆలస్యం అవుతుంది.
– డీ ఉదయ్కుమార్రెడ్డి, ఎస్పీ, ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఏప్రిల్ 18న ఫిరోజ్ తన మొబైల్ పోగొట్టుకున్నాడు. అలాగే జనవరి 6న వాహనం నడిపే క్రమంలో నీలేశ్ సెల్ఫోన్ కూడా పోయింది. ఇద్దరూ సీఈఐఆర్ అప్లికేషన్లో ఏప్రిల్ 18న దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 20న బాధితులకు పోగొట్టుకున్న ఫోన్లను ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, డీఎస్పీ ఉమేందర్,
సీఐలు పురుష్తోతం, సత్యనారాయణ అందజేశారు.