జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు కొనసాగాయి. అధికారులు విద్యార్థులతో ప్రతిజ్ఞ కూడా చేయించారు. ఓటరు ప్రాధాన్యతను వివరించి, 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు.
– నిర్మల్ టౌన్, జనవరి 25
నిర్మల్ టౌన్, జనవరి 25 : ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థు లు, జిల్లా అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు ర్యాలీ తీసి అక్కడే విద్యార్థులు, అధికారులు మానవహారంగా ఏర్పడి ఓటు ప్రాధాన్యతను వివరించారు. అంతకుముందు కలెక్టరేట్లో ఉద్యోగులు, సిబ్బంది ఓటరు ప్రతిజ్ఞ చేపట్టారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు క ల్పించామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, డీఆర్డీవో విజయలక్ష్మి, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, ఆర్డీవో స్రవంతి, జిల్లా అధికారులు శంకరయ్య, నర్సింహారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీకళ, ముత్యం, మల్లికార్జున్, రవీందర్రెడ్డి, తుకారాం, జీవన్రెడ్డి, రాజకీ య పార్టీల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఓటు హక్కుపై వినూత్నంగా అవగాహన
ఇచ్చోడ, జనవరి 25 : మండలంలోని ముక్రా(కే) గ్రామంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాడ్గె మీనాక్షి ఆధ్వర్యంలో ఎడ్ల బండిపై గ్రామంలో వీధుల గుండా తిరుగుతూ వినూత్నం గా ఓటరు నమోదుపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ మన భవిష్యత్ను మనమే నిర్ణయించుకునే శక్తి ఓటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. అందువల్ల వివేకం, విజ్ఞతతో ఓటు వేయాల్సిన బా ధ్యత మనందరిపై ఉందన్నారు. అలాగే మండలకేంద్రంలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు ఊరేగింపు నిర్వహించి ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. అలాగే సిరికొండ మండలకేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో ఓటు హక్కుపై వివరించి ప్రతిజ్ఞ చేశారు. తహసీల్దార్లు మోహన్ సింగ్, సర్పరాజ్, దీప్తి, శంకర్, ఆర్ఐ విలాస్, నాయబ్ తహసీల్దార్ రామారావు, ఎంఈవో ఉదయరావు, ఎంపీపీ ప్రీతం రెడ్డి, సర్పంచ్ సునీత పాల్గొన్నారు.