కుభీర్, ఏప్రిల్ 9 : ఉగాదిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి చేనుకు వెళ్లిన విమలబాయి(45) అందరికీ వడ్డించి కలిసి భోజనం చేయకుండానే అనంత లోకాలకు వెళ్లింది. పార్డి(కె) గ్రామానికి చెందిన తిర్మన్పెల్లి విమలాబాయి, ఆమె భర్త సంభాజీ, మరిది విఠల్, ఇద్దరు కూతుర్లు, కుమారుడితోపాటు తోటి కోడలుతో కలిసి మంగళవారం చేనులో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టేందుకు వెళ్లారు.
ఈ క్రమంలో విమలాబాయి అందరికీ వడ్డించి తాను భోజనం చేద్దామని నోట్లోకి బుక్క పెట్టుకుంటుండగానే ఒక్కసారిగా కుప్పకూలింది. కుటుంబ సభ్యులు భైంసాకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన కలిచివేసింది.