రెబ్బెన : ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి అన్నారు. రెబ్బెన గ్రామ పంచాయతీ పరిధిలోని సింగల్గూడ గ్రామంలో 1.20లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించటంతో పాటు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయటం, మంచినీటి వసతిని కల్పిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వేముర్ల సంతోశ్, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు చెన్న సోమశేఖర్, సర్పంచ్లు బొమ్మినేని అహల్యదేవి, బుర్స పోశమల్లు, ఉపసర్పంచ్ మడ్డి శ్రీనివాసగౌడ్, బాలాజీ ఆలయ చైర్మన్ వోల్వోజి వెంకటేశంచారి, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్గౌడ్, మాజీ ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, నాయకులు సర్వేశ్వర్గౌడ్, అన్నపూర్ణ అరుణ, లత తదితరులు పాల్గొన్నారు.