ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో సీఎం కేసీఆర్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చిత్రపటాలకు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. లక్షలోపు రుణాలను మాఫీ చేసి రైతులను సీఎం కేసీఆర్ ఆదుకున్నాడని, దీనికితోడు రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల శాఖ అధ్యక్షుడు జీవన్రెడ్డి, కన్వీనర్ తోట వెంకటేశ్, సర్పంచ్ పోతారెడ్డి నాయకులు పాల్గొన్నారు.