ఎదులాపురం, జనవరి 2 : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కారం చూపాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు వచ్చి వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కలెక్టర్ వాటిని స్వీకరించి సాధ్యాసాధ్యాల మేరకు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ ప్రజావాణిలో భూ సంబంధ, ఉపాధి, పింఛన్ల మంజూరు గ్రామాలు, పట్టణాల్లో మౌళిక సదుపాయాలు, వైద్యసేవలపై అర్జీలు వచ్చాయన్నారు. భూ సంబంధ సమస్యలపై కలెక్టర్ స్పందిస్తూ ధరణి పోర్టల్ మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, ఆర్డీవో రాథోడ్ రమేశ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
ఉట్నూర్, జనవరి 2 : గిరిజనుల సమస్య లను సత్వరమే పరిష్కరించాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అధికారులను ఆదేశిం చా రు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ కార్యాల యంలో గిరిజన దర్బార్ నిర్వ హించా రు. ఉమ్మడి జిల్లాల నుంచి గిరిజనులు వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చారు.
ఈ సందర్భంగా పీవో మాట్లాడారు. రైతు బంధు, స్వయం ఉపాధి పథకాలు, పోడు భూములు, వ్యవసాయ, రెవె న్యూ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్ర మంలో ఏపీవో జనరల్ కనక భీంరావ్, డీడీ దిలీప్ కుమార్, అదనపు వైద్యాధికారి మనో హర్, ఏపీవో పీవీటీజీ ఆత్రం భాస్కర్, ఏవో రాంబాబు, ఉద్యానవన అధికారి సుధీర్, ఓఎస్డీ కృష్ణయ్య, డీపీవో ప్రవీణ్, బీఈడీ కళా శాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.