ఉట్నూర్ రూరల్, ఫిబ్రవరి 9 : ఏజెన్సీలో నీటి ప్రాజెక్ట్లు తక్కువ. దీనికితోడు బీడు భూములు. సాగునీటి సౌకర్యం సరిగా లేక కేవలం వర్షాధార పంటలే సాగు చేస్తుండేవారు. దిగుబడులు కూడా అంతంతమాత్రంగానే వస్తుండడంతో రైతులు కూడా నష్టపోయిన సందర్భాలు ఉండేవి. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం పండుగలా సాగుతున్నది. గత యాసంగిలో కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో బావులు, చెరువుల్లోకి పుష్కలంగా నీళ్లు చేరాయి. దీనికితోడూ రైతులకు ఉచితంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యత్ సరఫరా చేస్తుండడంతో సాగు నీటికి ఇబ్బందిలేకుం డా అయ్యింది. దీంతో గతంలో కంటే ఈ యా సంగిలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. మండలంలోని దంతన్పెల్లి, కొత్తగూడెం, చింగూడ, క ల్లూర్గూడ, శ్యాంపూర్, నాగాపూర్, హస్నాపూర్, చాందూరి, పులిమడుగు, సాలేవాడ, ఉమ్రి, కుమ్మరితండా గ్రామాల్లో శనగ, గోధుమ, మక్కజొన్న, జొన్న , వీటితో పాటు ఆకుకూరలు, కూరగాయలు టమాట, వంకాయ, గోబీ తదితర పం టలు పండిస్తున్నారు. వానకాలంలో వేసిన సో యా, పత్తి పంటలు కాలం ముగియగానే వాటిని తొలగించి యాసంగి పంటలు సాగుచేశారు.
యాసంగిలో కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో శ్యాంపూర్, పులిమడుగు, సా కెర, సాలెవాడ, నాగాపూర్, హస్నాపూర్, చాం దూరి, ఉట్నూర్, దంతన్పెల్లి తదితర గ్రామాల్లోని బావులు నిండుగా ఉండగా, బోర్లనుంచి పుష్కలంగా నీళ్లు వస్తున్నా యి. దీంతో సాగునీటికి ఇ బ్బంది లేకుండా అయ్యింది. అంతేగాకుండా చెరువుల కింద ఆరుతడి పంటలైన గోధుమ, మక్కజొన్న, జొన్న, శనగ పంటల విస్తీర్ణం పెరిగింది. వీటితో పాటు ఆకుకూరలు, కూరగాయలు కూడా పండిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుండడంతో బోరుబావుల కింద పంటలతో పా టు మక్కజొన్న, జొ న్న, శనిగ, వేరు శనిగ, గోధుమ, కూ రగాయ లు, ఆకుకూరలు తదితర ఆ రుతడి పంటలను సాగు చేస్తున్నా రు. నిరంతర విద్యుత్ సరఫరాతో నాడు బీళ్లుగా ఉన్న భూములు ప్రస్తు తం పచ్చదనంతో కళకళలాడుతున్నా యని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాకు మూడెకరాల భూమి ఉంది. గతంలో కరెంట్ సమస్య తీవ్రంగా ఉండేది. దీంతో అంతంతమాత్రంగానే సాగు చేసేవాడిని. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకా 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఆకుకూరలు, కూరగాయల పంటలు పండిస్తున్నాను.
-చెంచాల రాజన్న, లక్కారం గ్రామ రైతు
గతంలో వర్షాధార పత్తి, సోయా పంటలే పండేవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ కష్టా లు లేవు. దీంతో పాటు బోరు, బావుల్లో సరిపడా నీరు ఉంది. ఇప్పుడు రెండెకరాల్లో సోయాతో పాటు కూరగాయలు పండిస్తున్నాను. సీఎం సకాలంలో విత్తనాలు కొరత లేకుండా అందించడం ఆనందంగా ఉన్నాం.
-దుర్గం గట్టయ్య, కొత్తగూడెం గ్రామ రైతు
రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తున్నాం. మండలంలో యాసంగిలో అధికంగా శనిగ, గోధుమ, మక్కజొన్న, జొన్నతో పాటు కూరగాయలు అధికంగా సాగవుతున్నాయి. మా సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతూ రైతులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. సాగునీటికి ఇబ్బందులు లేకపోవడంతో రైతులకు దిగుబడులు కూడా అధికంగా వస్తున్నాయి.
– రాథోడ్ గణేశ్, మండల వ్యవసాయాధికారి