తెలంగాణ రాక ముందు.. కరెంట్ కోతలు, సాగు నీరుకు తీవ్రమైన కరువు ఉండేది. భూములు బీడుగా ఉండి.. సాగుపై ఆధారపడిన రైతులు, కూలీలు, వ్యవసాయాధారిత పనులు చేసే వారికి పని దొరుకక వలస వెళ్లేవారు. దినదిన గండంగా బతికేది. ఇదీ గత ప్రభుత్వ హయాంలో సంక్షోభ పరిస్థితి.. తెలంగాణ వచ్చినంక 24 గంటల ఉచిత కరెంట్తో బీడు భూములన్నీ సస్యశ్యామలం అయ్యాయి. రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీపై ఎరువులు, అర్హులకు పింఛన్లు.. ఇలా ఎక్కడ చూసినా సంక్షేమమే కండ్ల ముందు కదలాడుతున్నది. పదేండ్లకు ముందు.. పదేండ్ల తర్వాత ఎంత మార్పు వచ్చిందో మీరే చూస్తున్నారు. మూడు గంటలే కరెంటిస్తామని, 10 హెచ్పీ మోటర్లు కొనుక్కోవాలని, ధరణిని ఎత్తేస్తామని కొందరు అంటున్నరు. అదే జరిగితే బతుకులు ఆగమైతయ్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దుర్భరంగా మారుతది. భూముల ధరలు ఢమాల్న పడిపోయి మళ్లీ వలసలు పెరుగుతయ్. మీరు సంక్షేమం వైపు ఉంటారో.. సంక్షోభం కోరుకుంటారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతా మీ చేతిలోనే ఉంది.. ఆలోచించండి నిర్ణయం తీసుకోండి..
– నిర్మల్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ను నమ్మేదే లేదు
నిర్మల్ నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడ్డం. కరెంట్, నీళ్లియ్యక నరకం చూపిన్రు. ఎవుసం చేసుడు మస్తు కష్టంగా ఉండే. గప్పటి బాధలు తల్సుకుంటేనే భయమైతది. మళ్లా ఎలక్షన్లు వచ్చినయి. కాంగ్రెసోళ్లు వచ్చి ఏదేదో చెబుతున్నరు. ఎవుసానికి మూడు గంటల కరెంట్ అంటండ్రు. గీ కరెంట్తో మూడు దొయ్యలైన పారుతయా.. అట్లనే 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోమంటుండ్రు. మరి డబ్బులెవ్వడిస్తడు.
గీ మోటర్లు పెట్టుకుంటే బావుల్లో నీళ్లుంటయా.. ఊట అందుతదా.. అందరం ఒకేసారి మోటర్లు పెడితే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవా.. ? నాకు ముజ్గి, మంజులాపూర్లో 6.34 ఎకరాలు ఉంది. రెండు బో ర్లు ఉన్నయ్. రెండు 5 హెచ్పీ మోటర్లు పెట్టుకున్న. గివ్విటితో మం చిగ మళ్లు పారుతయి. సర్కారోళ్లు ఇచ్చే 24 గంటల కరెంట్తో రం ది లేకుంట ఎవుసం చేసుకుంటున్నం. అధికారంలోకి వచ్చేందుకు అడ్డమైన మాటలు చెప్పే కాంగ్రెసోళ్లను నమ్మేదే లేదు. మేమంతా సీఎం కేసీఆర్ వెంటే నడుస్తం.
– బొడ్డు దేవన్న, రైతు, మంజులాపూర్