భైంసా, జూలై 9 : అమర్నాథ్ యాత్ర వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారి నిలిచింది. జమ్ము,శ్రీనగర్ హైవేలో కొండ చరియలు విరిగిపడి పలు ప్రాంతాల్లో అమర్నాథ్ యాత్రికులు చిక్కుకుపోయారు. అమర్నాథ్ యాత్రకు భైంసా పట్టణానికి చెందిన 10 కుటుంబాలు వెళ్లగా ప్రస్తుతం వారు అక్కడ చిక్కుకుపోయారు.
ఈ బృందం కొండ చరియలు విరిగి పడి న ప్రాంతాల్లో ఉండడంతో మార్గమధ్యలో చిక్కుకుపోయింది. వెంటనే సీఆర్పీఎఫ్ జవాన్ల బృందం వారిని రక్షించి నీల్ఘాట్ క్యాంప్లో సురక్షితంగా ఉంచారు. వీరు అమర్నాథ్ దర్శనానికి సోమవారం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో సచిన్, వెంకటేశ్, రవీందర్ ఉన్నారు.