సోన్, జనవరి 31 : తెలంగాణ సరిహద్దు రాష్ర్టాల్లో బీఆర్ఎస్కు ఆదరణ లభిస్తున్నదని రాష్ట్ర, అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదా శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర సర్కారు పేదల సంక్షేమమే ఎజెండాగా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుచేస్తున్నదని, ఇలాంటి అభివృద్ధి తమ ప్రాంతంలో కూడా జరగాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. నిర్మల్ మండలం చిట్యాల గ్రామంలో రూ.3.50 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంగళవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా స్వర్ణవాగు పక్కన గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో రూ.26 లక్షలతో అభివృద్ధి పనులు.., నూతనంగా 19 మందికి మంజూరైన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం.., గ్రామ పంచాయతీ నుంచి వైకుంఠధామం వరకు నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఇక్కడ ఇప్పటికే 71 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించినట్లు గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ మధ్య మహారాష్ట్రలోని కొన్ని ఊళ్లలో తిరిగినట్లు చెప్పారు. కిన్వట్, నాందేడ్, బోకర్, కిని, అప్పారావుపేట్, హిమాయత్నగర్లో ఎంతో ఆదరణ లభించిందన్నారు. బీఆర్ఎస్ సర్కారు ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి సంతోషపడుతున్నారని తెలిపారు. అక్కడ ఊరంతా 100 పింఛన్లు ఇస్తే.. ఒక్క చిట్యాల గ్రామంలోనే 800 పింఛన్లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అక్కడ పింఛన్ రూ.800 ఇస్తుంటే.. మన దగ్గర రూ.2,016 ఇస్తున్నామని చెప్పారు. అలాగే కరంట్ సరఫరా అక్కడ నాలుగు గంటలే సరఫరా అవుతున్నదని, కానీ ఇక్కడ 24 గంటలు అందిస్తున్నామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని దేశమంతా విస్తరించి, తెలంగాణ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఎక్కడా అమలుకావడం లేదన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు.
చిట్యాల గ్రామంలో ఏది కావాలన్నా అడిగిన వెంటనే ఇచ్చామని తెలిపారు. రూ.17 లక్షలతో చెక్డ్యాం నుంచి చెరువులోకి నీరును మళ్లించే పథకాన్ని త్వరలో చేపడుతామన్నారు. అంతకుముందు స్థానిక సర్పంచ్ పడకంటి రమేశ్రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో మంత్రి అల్లోలకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, నిర్మల్ ఎంపీపీ కే రామేశ్వర్రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, ఉప సర్పంచ్ చిన్నయ్య, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు డాక్టర్ సుభాష్రావు, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్రెడ్డి, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ తుకారాం, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో సాయిరాం, ఎంపీటీసీ రాజవ్వ, డీఎస్పీ జీవన్రెడ్డి, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గుండంపల్లిలో వేంకటేశ్వర స్వామి, కాండ్లీలో గంగాదేవి ఆలయాలు ప్రారంభం..
దిలావర్పూర్ మండలం గుండంపల్లిలో రూ.36 లక్షలతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని.., అలాగే కాండ్లీ గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన గంగాదేవి ఆలయాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇప్పటి వరకు 589 ఆలయాలకు నిధులు నిధులు మంజూరుచేసినట్లు చెప్పారు. గుండంపల్లిలో వేం కటేశ్వర స్వామి ఆలయం వద్ద రాజగోపురం నిర్మాణానికి రూ.45 లక్షలు, కళ్యాణ మండపానికి రూ. 50 లక్షలు త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే నిర్మల్-భైంసా 61వ జాతీయ రహదారి పక్క నుంచి ఆలయం వరకు రోడ్డు బీటీ రోడ్డు పనులకు రూ.కోటితో ప్రతిపాదనలు సిద్ధం చేసి, పంపినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్యాకేజీ-27 పనులతో నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులు త్వరలోనే పూర్తి చేసి, రైతులకు నీరందిస్తామని చెప్పారు.
‘కంటి వెలుగు’ శిబిరం పరిశీలన..
దిలావర్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ శిబిరాన్ని మంత్రి పరిశీలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి, రోజువారీ పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తక్కల సంగీత, ఎంపీపీ పాల్ధే అక్షర, బన్సపల్లీ సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి, వేంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఏలాల చిన్నారెడ్డి, జడ్పీటీసీ తక్కల రమణారెడ్డి, మాజీ ఎంపీపీ ఏలాల అమృత, మండల ఉపాధ్యక్షుడు బాబురావు, మాజీ ఎంపీటీసీ కొమ్ముల సవి త, బీఆర్ఎస్ నాయకులు పాల్ధే అనిల్, ఓడ్నం కృ ష్ణ, ఆడెపు శ్రీనివాస్, గంగారెడ్డి, దనే రవి, సప్పల రవి, అరుణ్, కొమ్ముల రాజారెడ్డి, ముస్కు ము త్యంరెడ్డి, గంగారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈద్గా పనులకు శంకుస్థాపన..
నిర్మల్ పట్టణ శివారు చించోలి(బీ) గ్రామంలో కొత్త ఈద్గా నిర్మాణానికి ముస్లిం పెద్దలతో కలిసి మంత్రి అల్లోల శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇచ్చిన హామీ మేరకే అతి తక్కువ సమయంలోనే స్థలం మంజూరు చేయించి, ఈద్గా నిర్మిస్తున్నామని తెలిపారు. 12 ఎకరాల విశాల స్థలంలో ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసుకునేలా మినార్లు, ప్రహరీ, ప్రధాన ద్వారం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సుమారు 25 వేల మంది సామూహిక ప్రార్థనలు చేసుకునేలా నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రంజాన్ నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు తౌహీద్ ఉద్దీన్, సలీం, ముస్లిం పెద్దలు మహ్మద్ యూసుఫ్, హబీబ్ జలానీ, నాయకులు రిజ్వాన్, అబ్దుల్ జావిద్, ఫిర్ధోస్, ముషీర్ తదతరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన సీఐలు..
మంత్రి అల్లోలను నిర్మల్ పట్టణ, రూరల్ సీఐలుగా బాధ్యతలు స్వీకరించిన మల్లేశ్, శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట నిర్మల్ డీఎస్పీ జీవన్రెడ్డి తదితరులున్నారు.
అంగన్వాడీలకు న్యాయం చేస్తాం..
సంక్షేమ పథకాల్లో పాలుపంచుకుంటున్న అంగన్వాడీలు, ఆశ క్యాకర్తలకు ప్రభుత్వం ద్వారా తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి అన్నారు. మంత్రి అల్లోలను జిల్లాలోని అంగన్వాడీలు, ఆశ క్యాకర్తలు, కేజీబీవీ పాఠశాలల నాన్ టీచింగ్ సిబ్బంది వేర్వేరుగా కలిసి, సమస్యలను వివరించారు. వాటి ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చా రు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సుజా త, రాజమణి, చంద్రకళ, గంగసాగర, లక్ష్మి, సరోజిని, రేఖ, భూమవ్వ తదితరులు పాల్గొన్నారు.