కుభీర్, డిసెంబర్ 23 :రోడ్ల నిర్మాణానికి తెలంగాన పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సాంవ్లి ఎక్స్ రోడ్డు నుంచి మోల వరకు రూ.64 లక్షల పీఆర్ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన శిలా ఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు చిన్న గ్రామా లకు బీటీ రోడ్లు వేసిన ఘనత తెలంగాణ సర్కారు దేనని పేర్కొన్నారు.
త్వరలో మహారాష్ట్ర సరిహద్దు గ్రామం లగ్లుద్కు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మోలకు రూ.20 లక్షలతో జీపీ బిల్డింగ్, గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, మన ఊరు-మన బడి కింద రెండో విడుతలో నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతు దినోత్సవం సంద ర్భంగా పలువురు రైతులను ఆయన శాలువాతో సత్కరిం చారు.
సర్పంచ్లు గంగాధర్, నర్సారెడ్డి, సాంవ్లి సర్పంచ్ కేర్ల గంగాధర్, సాంవ్లి మాజీ సర్పంచ్, బాసర జడ్పీటీసీ ఎల్వంత్వార్ వసంత రమేశ్, వైస్ ఎంపీపీ మోహియొద్దీన్, పీఆర్ డీఈ, ఏఈ సురేశ్, సూర్యతేజ, సహకార సంఘం చైర్మన్ రేకుల గంగాచరణ్, వైస్ చైర్మన్ మెంచు రమేశ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు న్యాలపట్ల దత్తూగౌడ్, ఏఎంసీ చైర్మన్ కందుర్ సంతోష్, వైస్ దిగంబర్ పటేల్, మండల కోఆప్షన్ సభ్యుడు దత్తహరి పటేల్, దిగంబర్ పటేల్, బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గాడేకర్ రమేశ్, నాయకులు మల్లారెడ్డి, సాయినాథ్, పానాజీ విజయ్కుమార్, గోనె కల్యాణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.