సారంగాపూర్, సెప్టెంబరు 15 : ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నా రు. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్ట్లో గురువారం చేప పిల్లలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకా రుల సంక్షేమానికి సర్కారు నిరంతరం కృషి చేస్తున్నద ని పేర్కొన్నారు. ఉచితంగా వాహనాలు, తెప్పలు, వలలు అందిస్తున్నదని తెలిపారు. మిషన్ కాకతీ య పథకం కింద చెరువులను పునరుద్ధరిం చామని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తున్నామని పేర్కొ న్నారు.
స్వర్ణ ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం ఇటీవల కోట్లాది రూపాయలను మంజూరు చేసి పనులు చేపట్టామని తెలిపారు. అడెల్లి ఆలయా నికి రూ. 12 కోట్లు మంజూరయ్యాయని, మొదటి దఫా కింద రూ. 6 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ నల్ల వెంకట్రామ్ రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఆశ్రితారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కొత్తపల్లి మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణ రెడ్డి, ఆలూర్ సొసైటీ చైర్మన్ మాణిక్ రెడ్డి, సర్పంచ్ అయేషా సిద్ధ్దిఖ, ఎంపీటీసీ భోజారెడ్డి, నాయకులు మల్లేశ్, రాజ్ మహ్మద్, నర్సారెడ్డి, కండెల భోజన్న, ఉట్ల రాజేశ్వర్, దేవి శంకర్, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ విధానంపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 15 : దేశంలో వ్యవ సాయవిధానంపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం వల్లే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం తొలి సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మార్కెట్ కమిటీ ద్వారా చేపడుతున్న కొనుగోళ్లు, మార్కెట్ నిర్వహ ణ, గోదాములు, పన్నుల వసూళ్లు, తదితర అంశాలపై పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నదని పేర్కొన్నారు. వరి సాగును మొన్నటివరకు వద్దని చెప్పిన కేంద్రం ఇప్పుడు వరిసాగును చేయాలని పేర్కొంటున్నదని తెలిపారు. మార్కెట్ కమిటీ ద్వారా ఆదాయ వనరులను పెంచుకునేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రిని ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజిగారి రాజేం దర్, మార్కెట్ కమిటీ జిల్లా అధికారి అశ్వక్ అహ్మద్, కార్యదర్శి ప్రశాంత్, సిబ్బంది మాధవ్, రజిత ఘనంగా సన్మానించారు.
మాత్రలు పిల్లలందరికీ అందించాలి
నిర్మల్ చైన్గేట్, సెప్టెంబర్ 15 : ఆరోగ్యవంత మైన జీవనానికి పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలు అందించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ నులిపురు గు నివారణ దినం సందర్భంగా నిర్మల్లోని రాంన గర్ దవాఖాన, గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీని మంత్రి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నులిపురుగుల సంక్రమణ పిల్లల్లో శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపు తుందన్నారు. ఏకాగ్రత, చదువుకునే సామర్థ్యం తగ్గుతుందన్నారు. తెలంగాణ ప్రభు త్వం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిం చిందన్నారు. జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్ వాణి రఘువీర్, డిప్యూటీ డీఎంహెచ్వో రాజేంద ర్, డీఐవో నయనారెడ్డి, పీవో శ్రీనివాస్, డిప్యూటీ జిల్లా విస్తరణ అధికారి రవీందర్, నాగేశ్వర్రావు, హెచ్ఎం సుభాష్, విద్యార్థులు పాల్గొన్నారు.