కాగజ్నగర్, డిసెంబర్ 20 : తెలంగాణ సర్కారు అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని అటవీ అభివృద్ధి శాఖ వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ అభివృద్ధి శాఖ డివిజన్ కార్యాలయ ఆవరణలో మంగళవారం భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అడవుల అభివృద్ధి, ప్లాంటేషన్ నిర్వహణ కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నదన్నారు.
సిర్పూర్ మిల్లుకు ఈ ఏడాదిలో 90 వేల మెట్రిక్ టన్నుల నీలగిరి కర్రను సరఫరా చేసినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ అటవీ అభివృద్ధి శాఖ డివిజన్ మేనేజర్, ప్లాంటేషన్ మేనేజర్ కార్యాలయాలు, సిబ్బందికి క్వార్టర్లు నిర్మించనున్నట్లు తెలిపారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.48 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినియర్ డివిజన్ మేనేజర్ స్కైలాబ్, కాగజ్నగర్ డివిజన్ మేనేజర్ శ్రావణి, ప్లాంటేషన్ మేనేజర్ ఏ జలపతి, ప్లాంటేషన్ డిప్యూటీ మేనేజర్ దుర్గం రాకేశ్, బెల్లంపల్లి ప్లాంటేషన్ మేనేజర్ గోపీ ప్రసాద్, మంచిర్యాల ప్లాంటేషన్ మేనేజర్ శైలజ, చంద్రశేఖర్, పేపర్ మిల్లు డీజీఎం సురేందర్నార్కరే పాల్గొన్నారు.