కుభీర్, జనవరి 12 : పేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో అండగా నిలుస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం కుభీర్ మండలంలోని 13 గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.8.96లక్షల చెక్కులను మండల నాయకులు, సర్పంచ్లతో కలిసి అందజేశారు. కార్యక్రమంలో కుభీర్ సర్పంచ్ పానాజీ మీరా విజయ్కుమార్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు మోరే దత్తహరి పటేల్, బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, దిగంబర్ పటేల్, సూది రాజన్న, సాహెబ్రావు, సిద్ధంవార్ శ్రావణ్, దత్తురాం, కళ్యాణ్, శేరి సురేశ్, మిలింద్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
భైంసా, జనవరి, 21 : నిర్మల్ జిల్లా భైంసా మండలం మన్మధ్ గ్రామానికి చెందిన కిని వెంకట్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మన్మధ్ గ్రామానికి వెళ్లి బాధితుడు వెంకట్ రెడ్డిని పరామర్శించాడు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అలాగే అదే గ్రామానికి చెందిన ఎండీ బురాన్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి దవాఖాన ఖర్చుల నిమిత్తం రూ. 26 వేలు సీఎం రీలిఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లలితాభోజన్న, మన్మధ్ శేఖర్ రెడ్డి, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.