నార్నూర్, నవంబర్ 30 : దీర్ఘకాలిక వ్యాధులతో బాధప డుతున్న రోగులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. మందుల కిట్లను అందిస్తూ భరోసా నింపుతున్నది. హైపర్టెన్షన్, డయాబెటీస్ తోపాటు ఓరల్, బ్రైస్ట్, సర్వైకల్ కెన్సర్, టీబీ, జ్వరం ఇతర వ్యాధులపై గత నెలలో అసంక్రమిత వ్యాధులపై (ఎన్సీడీ) వైద్యాధి కారులు, వైద్య సిబ్బంది మండలాల్లోని పీహెచ్సీల వారీగా సర్వే చేపట్టారు.
అయితే ఎక్కువ శాతం బీపీ, షుగర్తో కిడ్నీ, గుండె జబ్బులు బారిన పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగానే స్కీమ్ను కొనసాగిస్తూ ప్రత్యేక కిట్ను రూపొందిం చి ఎన్సీడీ కిట్గా నామకరణం చేసింది. దీంతో ప్రభుత్వ దవాఖాన పరిధి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల వారీగా నమోదైన రోగు లకు ఆశ కార్యకర్తల ద్వారా ఇంటింటికీ కిట్తో కూడిన మందులను అందజేస్తున్నారు.
1215 మంది గుర్తింపు
నార్నూర్, గాదిగూడ మండలంలోని పీహెచ్సీ పరిధిలో 1215 మంది బీపీ, షుగర్ బాధితులను వైద్యాధికారులు గుర్తించారు. మూడు పీహెచ్సీ లకు 568 ఎన్సీడీ కిట్లను పంపిణీ చేశారు. ఇందు లో 936 మందికి బీపీ, 297 షుగర్ కలిగి ఉన్నా రు. వీరు దవాఖానల్లోని డయాబెటీస్ మందులు వాడుతుంటారు. ఇందులో కొంత మంది ప్రైవేటు దవాఖానలో మందులు వాడుతుంటారని వైద్యు లు వివరించారు.
568 మందికి కిట్లు సరఫరా
ఉమ్మడి మండలలో హైబీపీ, షుగర్ పేషంట్లకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం 568 ఎన్సీడీ కిట్లను అందజేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా పంపిణీ చేస్తూ వస్తున్నారు. దీనివల్ల వేలాది రూపాయాల మందుల ఖర్చు భారం వ్యాధి గ్రస్తులకు తగ్గింది. అధిక రక్తపోటు, మధుమేహం నియంత్రణలో లేకపోతే కలిగే దుష్ఫరిణామాలు ఉంటాయి. వారు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాల్సి ఉంది. వైద్యుడి సలహాలు, సూచన లు తీసుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయని పేర్కొన్నారు.
జాగ్రత్తలు పాటించాలి..
బాధితులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త లు పాటించాలి. ఆహా రం అలవాట్లు కూడా మార్చుకోవాలి. ప్రాణాంతకమైన వ్యాధులు సక్రమించి అర్థాంతరంగా మరణి స్తున్నారని ప్రభుత్వం ఎన్సీడీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. క్రమం తప్పకుండా మందులు వాడి ప్రాణాలను కాపాడుకోవాలి. ప్రతి వ్యాధిగ్రస్తులకు ఎన్సీడీ కిట్లను అందిస్తాం. ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తున్నది.
– డాక్టర్ పవన్కుమార్(పీహెచ్సీ,ఝరి)