బాసర : ఈనెల 16న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన విద్యార్థిని తేజస్విని ( Tejaswini ) కుటుంబ సభ్యులు శుక్రవారం బాసర త్రిబుల్ ఐటీ ( Basara IT ) గేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తమ బిడ్డకు లుకేమియా లేదని పేర్కొన్నారు. లుకేమియా ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని విద్యార్థిని తల్లిదండ్రులు వాపోయారు. కళాశాలకు వచ్చి వచ్చి గంటసేపైనా ఎవరూ స్పందించడం లేదని వారు ఆరోపించారు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని బైటాయించారు. సెక్యూరిటీ గార్డులతో కళాశాల గేటు ఎదుటే తమను ఆపివేశారని మండిపడ్డారు.