తానూర్, జూన్, 28 : ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని దీక్షా కళాశాలకు చెందిన, తానూర్ మండల విద్యార్థి గైనేవార్ వినాయక్ (బైపీసీ) స్టేట్ టాపర్గా నిలిచాడు. మండలంలోని బోంద్రట్ గ్రామానికి చెందిన గైనేవార్ మహానందా-మాధవ్రావ్ దంపతుల కుమారుడు వినాయక్, బైపీసీలో 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించాడు.
ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు భోసి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. ఈ సందర్భంగా వినాయక్ను సర్పంచ్ గోదల మందాకినీకేశవ్ శాలువాతో సన్మానించి, స్వీట్ను తినిపించారు. అలాగే గ్రామస్తులు, కళాశాల యాజమాన్యం, తానూర్ మండలవాసులు హర్షం వ్యక్తం చేశారు.