నార్నూర్, ఆగస్టు 6 : జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరు బాగుందని స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం సభ్యులు కొనియాడారు. మండలంలోని మాన్కాపూర్, బాబేఝరి గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్రియ బృందం ప్రతినిధులు ఆదివారం పర్యటించారు. గ్రామపంచాయతీతో పాటు పరిధిలోని గ్రామాలను సందర్శించారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పారిశుధ్యం, ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, సిగ్రిగేషన్ షెడ్ల వినియోగంతో పాటు పలు అంశాలను సర్పంచ్, అధికారులు, పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా మారుమూల మండలం అయినప్పటికీ ప్రభుత్వ పథకాల అమలు తీరు బాగుందని, ఇది ఇలాగే కొనసాగించాలని బృందం ప్రతినిధులు కిశోర్, సునీల్గౌడ్ అధి కారులు, ప్రజాప్రతినిధులను ప్రశంసించారు. వీరి వెంట సర్పంచులు రాథోడ్ సావీందర్, మడావి కైలేశ్వరీసాగర్, ఎంపీడీవో కావల రామేశ్, ఇన్చార్జి ఎంపీవో మహేశ్కుమార్, ఎస్బీఎం జిల్లా కోఆర్డినేటర్ రాథోడ్ సందీప్, టెక్నికల్ అసిస్టెంట్ వికాస్ చౌహాన్, జాదవ్ కైలాశ్, జాదవ్ సచిన్, పంచాయతీ కార్యదర్శులు లవ్కుమార్, విజయ్కుమార్ తదితరులున్నారు.
మండలంలోని ఈశ్వర్నగర్, ఇంద్రవెల్లి, తేజాపూర్ గ్రామపంచాయతీల పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీ ణ కేంద్ర బృందం సభ్యులు వెంకటేశ్, నవీణ్తేజ, గణేశ్ మండల అధికారులతో కలిసి పర్యటించారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోక్పిట్స్, డ్రైనేజీలు, డంప్ యార్డు, కంపోస్ట్ షెడ్లు, చెత్తను తరలించే ట్రాక్టర్లు, అంగన్వాడీ కేంద్రాలు, అరోగ్యకేంద్రాలు, పాఠశాలలు, తడి-పొడి చెత్త సేకరించే విధానాన్ని పరిశీలించా రు. అభివృద్ధి పనులతోపాటు వివిధ కార్యక్రమా ల్లో ప్రజలను భాగస్వాములు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీ వో కిషన్, ఎంపీడీవో పుష్పలత, సర్పంచ్లు కో రెంగా గాంధారి, రాథోడ్ శారద, మడావి కామేశ్వరి, ఎంపీవో సంతోష్కుమార్, ఇంద్రవెల్లి ఈ వో సంజీవరావ్, ఇంద్రవెల్లి మాజీ సర్పంచ్ కో రెంగా సుంకట్రావ్, గ్రామస్తులు పాల్గొన్నారు.