భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులకు మద్దతు వెల్లువెత్తుతున్నది. సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన వెంటనే స్వచ్ఛందంగా, సంపూర్ణంగా సంఘీభావం తెలుపడానికి ఊర్లకు ఊర్లు తరలివస్తున్నాయి. మీ వెంటే మేముంటామని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అభ్యర్థులను కలవడం, శాలువాలతో సన్మానించడం, పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, పార్టీలో చేరడం చేస్తున్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని తాటిగూడలో ఎమ్మెల్యే జోగు రామన్నను కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో కలిశారు.
పార్టీలో చేరడంతో వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించాడు. ముథోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విఠల్రెడ్డిని టాక్లి గ్రామస్తులు కలిసి మద్దతు తెలిపారు. ఖానాపూర్ పట్టణంలోని తన నివాసంలో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ను ఇంద్రవెల్లి, ఖానాపూర్, కడెం మండలాలకు చెందిన నాయకులు తిరుపతి లడ్డూ అందజేశారు. నేరడిగొండలోన తన నివాసంలో బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ను తాంసి, తలమడుగు, గుడిహత్నూర్, బజార్హత్నూర్, బోథ్, ఇచ్చోడ మండలాల నుంచి అభిమానులు తరలివచ్చి మద్దతు తెలిపారు.
– ఎదులాపురం/ఖానాపూర్/నేరడిగొండ/భైంసా టౌన్, ఆగస్టు 27