తలమడుగు, అక్టోబర్ 30 : ఆదరించండి.. బోథ్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బోథ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఝరి, పూనగూడ, కప్పర్దేవి, ఉమ్రి, దేగామ, పల్సి(బీ), తండా గిరిజన గ్రామాల్లో నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ నగేశ్తో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన గ్రామాల్లో వారికి మంగళహారతులతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి నగేశ్ మాట్లాడుతూ.. బోథ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్ జాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తండా గ్రామంలోని నారాయణ బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు జీవన్రెడ్డి పాల్గొన్నారు.